పిల్లల్ని వదిలేసి వానితో లేచిపోయిన బాగుండు.. రజితను ఎన్కౌంటర్ చేయండి : చెన్నయ్య

రజిత భర్త చెన్నయ్య సంచలన విషయాలు వెల్లడించారు. గత రెండు నెలలుగా తనపై ఎక్కడలేని ప్రేమ చూపించినట్లు నమ్మించి చివరకు తన గొంతు కోసిందన్నారు.తన పిల్లల్ని వదిలేసి అతనితో వెళ్లిపోయిన పిల్లల్ని బంగారం లాగా చూసుకునే వాడినని వెల్లడించారు.

author-image
By Krishna
New Update
ameenpur-Chennaiah

ameenpur-Chennaiah

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఓ తల్లి తన కన్న బిడ్డలను చంపిన ఘటన అమీన్పూర్ లో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.  ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది.  ఈ ఘటనలో నిందితురాలు రజిత, ఆమె ప్రియుడు శివను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.  అయితే ఈ ఘటనపై రజిత భర్త చెన్నయ్య సంచలన విషయాలు వెల్లడించారు. గత రెండు నెలలుగా తనపై ఎక్కడలేని ప్రేమ చూపించినట్లు రజిత  నమ్మించి చివరకు తన గొంతు కోసిందన్నారు. తన పిల్లల్ని వదిలేసి అతనితో వెళ్లిపోయిన తాను పిల్లల్ని బంగారం లాగా చూసుకునేవాడినని వెల్లడించారు. పిల్లల్ని చంపినందుకు కనీసం తన భార్యకు పశ్చాత్తాపం కూడా లేదని, ఆసుపత్రిలో కన్నీళ్లు కూడా పెట్టుకోలేదన్నారు. ఇలాంటి తల్లి ఎవరికి ఉండకూడదన్నారు. తన భార్య రజిత, శివను ఎన్కౌంటర్ను చేస్తేనే తన పిల్లల ఆత్మకు శాంతి చేకూరుతుందని చెన్నయ్య తెలిపారు. 

రజితకు, చెన్నయ్యకు 20ఏళ్ల ఏజ్ గ్యాప్

మీన్​పూర్ మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలో అవురిజింతల చెన్నయ్య.. భార్య రజిత అలియాస్​లావణ్య కాపురం ఉంటున్నారు. చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేస్తుండగా.. రజిత ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తుంది. వీరికి సాయికృష్ణ (12), మధుప్రియ (10), గౌతమ్​(8) ముగ్గురు పిల్లలున్నారు. చెన్నయ్య మొదటి భార్య చనిపోవడంతో లావణ్యను రెండో పెండ్లి చేసుకున్నాడు. రజితకు, చెన్నయ్యకు 20ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. అయితే ఆరు నెలల క్రితం జరిగిన పదవ తరగతి గెట్ టు గెదర్ పార్టీలో రజితకు తన క్లాస్మేట్ అయిన శివతో పరిచయం మరింతగా పెరిగింది. నెంబర్స్ మార్చుకుని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఇది వివాహేతర సంబంధానికి దారి తీసింది. చాలా సార్లు శారీరకంగా కూడా కలిశారు.

భర్తతో ఏజ్ గ్యాప్ ఉండటం,ప్రియుడి మోజులో బాగా మునిగి తేలిన రజితకు భర్త, పిల్లలపై ప్రేమ పూర్తిగా తగ్గిపోయింది. శివకు ఇంకా పెళ్లి కాకపోవడంతో, ఎలాగైనా అతన్ని పెళ్లి చేసుకొని జీవితాంతం సుఖంగా ఉండాలని రజిత భావించింది. ఇందుకోసం తననుపెళ్లి చేసుకోవాలంటూ శివ ముందు ప్రపొజల్ పెట్టింది. ఒకవేళ నీకుపెళ్లి కాకపోయి, పిల్లలు లేకుండా ఉంటే.. కచ్చి తంగా తానుపెళ్లి చేసుకుంటానని శివ చెప్పాడు. దీంతో భర్త, పిల్లల అడ్డు తొలిగించుకుని ప్రియుడితో సుఖంగా ఉండాలని రజిత స్కె్చ్ వేసి..  పెరుగులో విషం కలిపి చంపేసింది. 

Also read : శారీరకంగా, మానసికంగా భర్త వేధింపులు.. భరించలేక!

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు