ఏపీలో ఘోర విషాదం! కొడుకు హిజ్రాను ప్రేమించాడని.. పేరెంట్స్ ఏం చేశారంటే

నంద్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొడుకు హిజ్రాను ప్రేమించాడనే మనస్తాపంతో తల్లిదండ్రులు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. దంపతులిద్దరూ మృతి చెందారు.

New Update
pakala beach

Nandyal crime

Nandyal District:  సాధారణంగా కన్నబిడ్డల  ప్రేమ తల్లిదండ్రులు బతికిస్తుందని చెబుతారు. కానీ ఆ కన్నబిడ్డ ప్రేమే వారి ప్రాణం తీయడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ విషాదకరమైన ఘటన ఆంద్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

ఇది కూడా చదవండి: అల్లు అర్జున్ కు బిగుసుకుంటున్న ఉచ్చు.. మరికొద్ది సేపట్లో ఏసీపీ కీలక ప్రెస్ మీట్!

హిజ్రాను ప్రేమించాడని 

నంద్యాల జిల్లా SBI కాలనీలో సుబ్బరాయుడు,సరస్వతి దంపతులకు సునీల్ అనే కొడుకు ఉన్నాడు. అయితే కొడుకు సునీల్ ఒక హిజ్రాను ప్రేమించాడు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు సుబ్బారాయుడు, సరస్వతి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. విషయం తెలుసుకున్న స్థానికులు వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ లాభం లేకపోయింది... అప్పటికే పరిస్థితి విషమించడంతో దంపతులిద్దరూ మృతి చెందారు.

Also Read: Hansika:హన్సిక అందాలు అదుర్స్.. డిజైనర్ లెహంగా, భారీ నెట్ సెట్ తో స్టన్నింగ్ ఫోజులు!

Advertisment
తాజా కథనాలు