/rtv/media/media_files/2025/04/24/6PNKO7YWhA0TVNZcVjyT.jpg)
Dalit Woman Raped At Gunpoint In Front Of 4 Year Old Son In Up
Hyd crime: అది 2019 నవంబర్.. హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ దగ్గర 26 ఏళ్ల యువతిని సామూహిక అత్యాచారం దారుణంగా హత్య చేశారు! అత్యాచారం చేసిన తరువాత యువతి మృతదేహాన్ని లారీలో తీసుకువెళ్లి ఒక బ్రిడ్జి కింద పడేసి తగలబెట్టారు. ఆ సమయంలో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది! అయితే సరిగ్గా ఆరేళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో వెలుగు చూసింది. రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని కిస్మత్పురా బ్రిడ్జి కింద నగ్నంగా పడి ఉన్న ఓ యువతి మృతదేహం లభ్యమవడం కలకలం రేపుతోంది. యువతి ఒంటిపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 25 నుంచి 30 ఏళ్ళ మధ్య వయసున్న యువతిగా గుర్తించారు.మూడు రోజుల క్రితమే హత్య చేసి పడేసినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు క్లూ టీమ్ సహాయం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) September 16, 2025
రాష్ట్రంలో అదుపు తప్పుతున్న లా&ఆర్డర్
నగరంలో నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహం లభ్యం.. మూడు రోజుల క్రితమే హత్య చేసి పడేసినట్టు అనుమానిస్తున్న పోలీసులు
హైదరాబాద్ – రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని కిస్మత్పురా బ్రిడ్జి కింద లభ్యమైన నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహం… pic.twitter.com/3ZBzQomgzx