AP Crime: మరో దారుణం.. ప్రియుడి కోసం భర్తను దారుణంగా హతమార్చిన భార్య!

అనంతపురం జిల్లా అక్కంపల్లి గ్రామానికి చెందిన సురేష్ బాబు అనే వ్యక్తిని అతడి భార్య అనిత కిరాతకంగా హత్య చేయించింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడు ఫక్రుద్దీన్‌ తో కలిసి భర్తను హతమార్చింది. ప్రస్తుతం అనిత, ఆమె ప్రియుడు పోలీసుల అదుపులో ఉన్నారు.

New Update
Anantapur Crime

Anantapur Crime

AP Crime:  మొన్న యూపీలో రఘువంశీ,  నిన్న గద్వాల్లో సర్వేయర్‌ తేజేశ్వర్‌, ఈరోజు అనంతపురంలో  సురేష్ బాబు ఇలా ఒకరి తర్వాత ఒకరు భార్యల చేతిలో హత్యలకు గురవుతున్న ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వివాహేతర సంబంధాల కోసం భార్యలు  కట్టుకున్న భర్తలను కడతేర్చడం సమాజాన్నే కలవరపెడుతోంది. తాజాగా అనంతపురం జిల్లా అక్కంపల్లి గ్రామానికి  చెందిన సురేష్ బాబు అనే వ్యక్తిని తన భార్య దారుణంగా చంపించింది.  వివాహేతర సంబంధినికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి హత్య చేయించింది. సుత్తితో కొట్టి కొట్టి  సురేష్ బాబును  కిరాతకంగా చంపాడు ప్రియుడు. అయితే ఈ హత్య వెలుగులోకి వచ్చిన గంటల వ్యవధిలోనే పోలీసులు కేసును ఛేదించారు. భార్య అనిత, ఆమె ప్రియుడు ఫక్రుద్దీన్‌ ని ప్రధాన సూత్రధారులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. 

వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని

అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  సురేష్ బాబు తన గ్రామా సమీపంలోని కల్యాణదుర్గం రోడ్డులో ఓ చిన్న హోటల్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే రెండు నెలల క్రితం అతడి భార్య అనితకు ఫక్రుద్దీన్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తన స్వగ్రామమైన గొరదిండ్ల  నుంచి పదేళ్ల కిందట అక్కంపల్లికి మకాం మార్చిన  ఫక్రుద్దీన్‌ స్థానిక సదాశివకాలనీలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. కాగా, ఫక్రుద్దీన్‌  రోజూ ఊరూరా, వీధి, వీధి   తిరిగి పండ్లు అమ్ముకునేవాడు. ఈ క్రమంలోనే అనిత, ఫక్రుద్దీన్‌ మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. కొంతకాలానికి భర్త సురేష్ బాబుకు ఆమెపై పై అనుమానం రావడంతో.. రోజూ తాగొచ్చి భార్యను వేధించేవాడు. 

దీంతో భర్త వేధింపుల గురించి ప్రియుడితో చెప్పుకొని  వాపోయేది. ఆ సమయంలోనే అనితకు  ఓ క్రూరమైన ఆలోచన వచ్చింది.  తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త సురేష్ ని చంపితే.. ఇక హ్యాపీగా ఉండొచ్చని ప్లాన్ వేసింది. భర్తను చంపేందుకు ప్రియుడిని ఉసిగొల్పింది. ప్రియురాలి కోరిక మేరకు ప్రియుడు కూడా వెనకా ముందు ఆలోచించకుండా,  కనీస విచక్షణ లేకుండా తలాడించాడు. 

సుత్తితో కొట్టి కొట్టి.. 

ప్లాన్ ప్రకారం.. సురేష్ రోజులాగే రాత్రి 11 గంటలకు హోటల్ మోసేసి బైక్ పై వెళ్తుండగా మార్గంమధ్యలోనే ప్రియుడు ఫక్రుద్దీన్‌ అతడిని దారుణంగా కొట్టి చంపాడు. ముందుగా సురేష్ బాబుపై ఓ సీసాను విసిరేయడంతో అతడు వాహనంతో సహా కిందపడిపోయాడు. ఇదే అదనుగా భావించి ఫక్రుద్దీన్‌ సురేష్ పై దాడికి దిగాడు. వెంట తీసుకెళ్లిన స్క్రూ డ్రైవర్ తో కొట్టి కొట్టి.. బండరాయితో బాది దారుణంగా హతమార్చాడు. మళ్ళీ ఏం ఎరగని వాడిలా అక్కడి నుంచి పారిపోయాడు. హత్య చేయడానికి ముందు రోజు  ఫక్రుద్దీన్‌  వ్యాపారం పనిమీద మార్తాడు అనే గ్రామానికి వెళ్ళాడట. అయితే అనిత అతడికి ఫోన్ చేసి.. ఈరోజే భర్తను చంపాలని సూచించింది. దీంతో ప్రియుడు  వెంటనే  తిరిగొచ్చి సురేష్ ని హతమార్చాడు. 

ఈ హత్య గురించి వెలుగులోకి వచ్చిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు..  గంటల వ్యవధిలోనే పోలీసులు కేసును ఛేదించారు. భార్య అనిత, ఆమె ప్రియుడు ఫక్రుద్దీన్‌ ని ప్రధాన సూత్రధారులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. 

updating.. 

ఇది కూడా చూడండి: Black Magic: ఏపీలో వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోకు క్షుద్ర పూజలు - ఇలా తయారయ్యారేంట్రా

Advertisment
Advertisment
తాజా కథనాలు