మార్గదర్శి అక్రమాల కేసులో ఇప్పటికే దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్న ఏపీ సీఐడీ.. ఆ కంపెనీ అధినేత, ఎండీ అయిన రామోజీరావు, శైలజాకిరణ్లను పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులు, డిపాజిట్దారుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలోనూ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శి చిట్ఫండ్స్కు చెందిన రూ.793.50 కోట్ల విలువైన చరాస్తులను జప్తు చేసేందుకు సీఐడీని అనుమతించింది. వాటిలో మార్గదర్శి చిట్ఫండ్స్ నగదు, బ్యాంకు ఖాతాల్లో సొమ్ము, నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన పెట్టుబడులున్నాయి.
పూర్తిగా చదవండి..రామోజీరావుకి బిగ్ షాక్… కోట్లు విలువైన చరాస్తులను జప్తు చేసిన సీఐడీ!
మార్గదర్శి చిట్ ఫండ్స్ ఛైర్మన్ రామోజీ రావుపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన కేసు కీలక మలుపు తిరిగింది. మరోసారి మార్గదర్శి చిట్స్కి చెందిన ఆస్తుల్ని భారీగా అటాచ్ చేస్తూ ఏపీ సీఐడీ షాక్ ఇచ్చింది. ఈసారి ఏకంగా రూ. 242 కోట్ల ఆస్తులు (చరాస్తులు) జప్తు చేసినట్లు తెలుస్తోంది. మార్గదర్శి ఛిట్ ఫండ్స్ సంస్థ ఛైర్మన్ రామోజీ రావు, ఎండీ శైలజా కిరణ్, ఇతర బ్రాంచ్ మేనేజర్ల పేర్లను ఇందులో పొందుపరిచారు.
Translate this News: