Adilabad: ఆదిలాబాద్ లో పట్టపగలే దారుణం.. భార్య గొంతు కోసిన భర్త..!

ఆదిలాబాద్ జిల్లాలో పట్టపగలే భార్య గొంతుకోసి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యాభర్తల మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. మరోసారి గొడవ పెద్దదవడంతో కోపంతో రగిలిపోయిన భర్త.. భార్య గొంతుకోసి తాను చనిపోయాడు.

Adilabad: ఆదిలాబాద్ లో పట్టపగలే దారుణం.. భార్య గొంతు కోసిన భర్త..!
New Update

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. బేలా మండలలోని సైదాపూర్ గ్రామంలో పట్టపగలే భార్య గొంతుకోసి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. సైదాపూర్ గ్రామంలో నివాసముంటున్న ఈ భార్య భర్తల మధ్య కుటుంబ కలహాల కారణంగా గత కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. తాజాగా వీరిద్దరి మధ్య మరో సారి వాగ్వాదం జరిగింది.

భార్య గొంతు కోసిన భర్త

దీంతో కోపాన్ని తట్టుకోలేకపోయిన భర్త భార్యను గొంతుకోసి చంపాడు. ఆ తర్వాత మనస్థాపానికి గురై తాను కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని హత్య జరిగిన ప్రాంతాన్ని పరీశీలించారు. దీని పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Also Read: Murder: ఓరి దుర్మార్గుడా.. భార్యమీద కోపంతో రెండు నెలల బిడ్డను చంపిన కానిస్టేబుల్! - Rtvlive.com

#adilabad-district #crime
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి