కాంగ్రెస్ తో (TS Congress) పొత్తుకు సీపీఎం (CPM) కటీఫ్ చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీ(BJP), బీఆర్ఎస్ (BRS) ను వ్యతిరేకిస్తూనే కాంగ్రెస్ తో స్నేహపూర్వక పోటీకీ సీపీఎం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పాలేరు, భద్రాచలం, వైరా, మిర్యాలగూడ, ఇబ్రహీంపట్నంలో పోటీకి అవకాశం ఇవ్వాలని సీపీఎం కాంగ్రెస్ ను కోరుతోంది. అయితే.. ఆ స్థానాలను ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖత చూపకపోవడంతో పొత్తుకు దూరంగా ఉండాలని సీపీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి మినహా మిగిలిన నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: TS Politics: కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీఆర్ఎస్ గూటికి ఎర్ర శేఖర్!
TS Elections 2023: కాంగ్రెస్ తో పొత్తుకు సీపీఎం కటీఫ్.. కారణమిదే?
రానున్న తెలంగాణ ఎన్నికల్లో సీపీఎం పార్టీ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆశించినన్ని సీట్లు ఇవ్వడానికి అంగీకరించకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Translate this News: