భారత్లో కోవిడ్ వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకున్న లక్షల మంది వ్యక్తుల డేటా లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి.రాజకీయ నాయకులతో పాటు పలువురు ప్రముఖుల పాస్పోర్ట్లు, ఐడీ కార్డ్ నంబర్లు, పుట్టినరోజులు, ఫోన్ నంబర్లు తదితర సమాచారం టెలిగ్రామ్ యాప్లో అందుబాటులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.టెలిగ్రామ్ యాప్లో ఎవరిదైనా నంబర్ను ఎంటర్ చేయగానే, వారికి సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చని చెబుతున్నారు.అనేక మంది ప్రముఖుల సమాచారాన్ని తాము చూడగలుగుతున్నామని పేర్కొంటూ చాలా మంది వ్యక్తులు టెలిగ్రామ్ యాప్ స్క్రీన్షాట్లను ట్విటర్లో పంచుకుంటున్నారు. అయితే ఈ వార్తలు నిరాధారమైనవని భారత ప్రభుత్వం చెప్పింది. కోవిన్ ప్లాట్ఫారమ్ పూర్తిగా సురక్షితమైనదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. “ఈ వార్తలకు ఎలాంటి ఆధారమూ లేదు. ఇవి దురుద్దేశపూర్వకమైనవని వ్యాఖ్యానించింది.
పూర్తిగా చదవండి..డేటా లీక్ కాలేదన్న కేంద్రప్రభుత్వం.. కోవిన్ పోర్టల్ పూర్తిగా సేప్….
Translate this News: