తెలంగాణ(Telangana)లో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకునేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్(congress) ఈ సారి కొత్త ఉత్సహంతో బరిలోకి దిగేందుకు రెడీ అవుతుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో హస్తం పార్టీకి మంచి మైలేజ్ వచ్చింది. బీఆర్ఎస్ నుంచి అసంతృప్తులు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీని ప్రకటించింది. ఏఐసీసీ నేతలు మురళీధరన్(muralitharan), బాబా సిద్దిఖీ, జిగ్నేష్ మేవాని(Jignesh mevani) ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్రావు థాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(revanth reddy), సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిను స్క్రీనింగ్ కమిటీ ఎక్స్అఫిషియో మెంబర్లుగా నియమించింది కాంగ్రెస్ హైకమాండ్.
పూర్తిగా చదవండి..ఈ సారి ఎలాగైనా గెలవాల్సిందే భయ్యా..టీ.కాంగ్రెస్లో అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ ప్రకటన.. టీమ్లో ఎవరెవరున్నారంటే?
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బరిలోకి దూకుతున్న కాంగ్రెస్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీని ప్రకటించింది. ఏఐసీసీ నేతలు మురళీధరన్, బాబా సిద్దిఖీ, జిగ్నేష్ మేవాని ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
Translate this News: