Jaggareddy: జగ్గారెడ్డి పంచాంగం.. రేవంత్ కు 100 మార్కులు.. అవమానం 2, రాజ్యపూజ్యం 18

రేవంత్ రెడ్డి పాలనకు తాను 100 మార్కులు వేస్తున్నట్లు చెప్పారు జగ్గారెడ్డి. ఉగాది సందర్భంగా తనదైన శైలిలో పంచాంగం చెప్పారు. ప్రభుత్వానికి అవమానం 2 అని.. అది కూడా ప్రతిపక్షాలతోనే అని అన్నారు. ప్రభుత్వానికి రాజ్యపూజ్యం 16 అని అన్నారు.

New Update
Jaggareddy: జగ్గారెడ్డి పంచాంగం.. రేవంత్ కు 100 మార్కులు.. అవమానం 2, రాజ్యపూజ్యం 18

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై (Revanth Reddy) కాంగ్రెస్ కీలక నేత జగ్గారెడ్డి (Jaggareddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. రేవంత్‌ పాలనకు 100 మార్కులు వేస్తున్నానన్నారు. నేడు ఉగాది సందర్భంగా తనదైన శైలిలో పంచాంగం చెప్పారు. ప్రభుత్వానికి అవమానం 2 అని.. అది కూడా ప్రతిపక్షాలతోనే అని అన్నారు. ప్రభుత్వానికి రాజ్యపూజ్యం 16 అని అన్నారు.
ఇది కూడా చదవండి: Revanth: నేను ఎక్కడున్నా.. నా గుండెచప్పుడు కొడంగల్.. సీఎం!

కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలంతా హ్యాపీగా ఉన్నారన్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్‌లో రాహుల్‌గాంధీనే కింగ్‌, కింగ్‌ మేకర్ అని అన్నారు. కేసీఆర్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారన్నారు. ప్రశాంత్ కిషోర్ ఓ సారి బీజేపీ అంటారు, మరోసారి కాంగ్రెస్ అంటారన్నారు. పీకే బతుకుదెరువు కోసం ఓ సంస్థ పెట్టుకున్నాడననారు. తాను పార్టీలు మారే వచ్చానని.. అందుకే పార్టీ ఫిరాయింపులపై మాట్లాడనన్నారు.

Advertisment
తాజా కథనాలు