Jaggareddy: జగ్గారెడ్డి పంచాంగం.. రేవంత్ కు 100 మార్కులు.. అవమానం 2, రాజ్యపూజ్యం 18 రేవంత్ రెడ్డి పాలనకు తాను 100 మార్కులు వేస్తున్నట్లు చెప్పారు జగ్గారెడ్డి. ఉగాది సందర్భంగా తనదైన శైలిలో పంచాంగం చెప్పారు. ప్రభుత్వానికి అవమానం 2 అని.. అది కూడా ప్రతిపక్షాలతోనే అని అన్నారు. ప్రభుత్వానికి రాజ్యపూజ్యం 16 అని అన్నారు. By Nikhil 09 Apr 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) కాంగ్రెస్ కీలక నేత జగ్గారెడ్డి (Jaggareddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. రేవంత్ పాలనకు 100 మార్కులు వేస్తున్నానన్నారు. నేడు ఉగాది సందర్భంగా తనదైన శైలిలో పంచాంగం చెప్పారు. ప్రభుత్వానికి అవమానం 2 అని.. అది కూడా ప్రతిపక్షాలతోనే అని అన్నారు. ప్రభుత్వానికి రాజ్యపూజ్యం 16 అని అన్నారు. ఇది కూడా చదవండి: Revanth: నేను ఎక్కడున్నా.. నా గుండెచప్పుడు కొడంగల్.. సీఎం! కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలంతా హ్యాపీగా ఉన్నారన్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్లో రాహుల్గాంధీనే కింగ్, కింగ్ మేకర్ అని అన్నారు. కేసీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారన్నారు. ప్రశాంత్ కిషోర్ ఓ సారి బీజేపీ అంటారు, మరోసారి కాంగ్రెస్ అంటారన్నారు. పీకే బతుకుదెరువు కోసం ఓ సంస్థ పెట్టుకున్నాడననారు. తాను పార్టీలు మారే వచ్చానని.. అందుకే పార్టీ ఫిరాయింపులపై మాట్లాడనన్నారు. #jaggareddy #cm-revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి