Madhu Sudhan: ప్రత్యేక హోదా తప్పకుండా ఇస్తాం.. కాంగ్రెస్ అభ్యర్థి కీలక వ్యాఖ్యలు..!

ప్రాంతీయ పార్టీలతో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పుట్టపర్తి అభ్యర్థి మధుసూదన్ రెడ్డి. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పకుండా ఇస్తామన్నారు. కాంగ్రెస్ తోనే భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు.

Madhu Sudhan: ప్రత్యేక హోదా తప్పకుండా ఇస్తాం.. కాంగ్రెస్ అభ్యర్థి కీలక వ్యాఖ్యలు..!
New Update

Madhu Sudhan Reddy: కాంగ్రెస్ తోనే రాష్ట్రం, దేశం బాగుపడతాయన్నారు కాంగ్రెస్ పుట్టపర్తి అభ్యర్థి మధుసూదన్ రెడ్డి.  ప్రాంతీయ పార్టీలతో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శలు గుప్పించారు. అమడుగూరు మండలం కసముద్రం గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాల గురించి వివరించారు.

Also Read: తిరుమలలో భారీ వర్షం.. చల్లదనాన్ని ఏంజాయ్ చేస్తోన్న భక్తులు..!

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పకుండా ఇస్తామన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తామన్నారు. ప్రకటించిన మేనిఫెస్టోలో 9 అంశాల పట్ల ప్రజలు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలియజేశారు. రైతు సంక్షేమం ఒక కాంగ్రెస్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సామాన్య ప్రజలనే నమ్ముకుని ముందుకెళుతోందన్నారు.

Also Read: క్రాంతి నా ప్రాపర్టీ కాదు.. కూతురుపై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు..!

టీడీపీ అధికారంలో ఉండగా ఇక్కడ గెలుపొంది ఐటీ మంత్రిగా పనిచేసిన పల్లె రఘునాథరెడ్డి గాని ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గాని నియోజకవర్గంకు చేసింది ఏమీ లేదన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే మండలానికి ఒక గవర్నమెంట్ పరిశ్రమను తీసుకొచ్చి గ్రామాల్లోని ప్రజలు వలస వెళ్లకుండా స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. క్రమేణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతోందని రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా కూటమి అధికారంలోకి రానున్నట్లు తెలిపారు.

#madhusudan-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి