ఒకటే లిస్ట్‌.. 119 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులు ఫైనల్‌

ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ స్క్రీనింగ్‌ కమిటీ ఆఖరి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 119 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఫైనల్‌ చేసినట్లు తెలిసింది. ఏఐసీసీ నేతలు ఇవాళ సాయంత్రం 119 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు.

New Update
ఒకటే లిస్ట్‌.. 119 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులు ఫైనల్‌

ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ స్క్రీనింగ్‌ కమిటీ ఆఖరి సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, మధు యాష్కీ హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో 119 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఫైనల్‌ చేసినట్లు తెలిసింది. కీలక చర్చల అనంతరం అభ్యర్థుల లిస్టు ఖరారైంది. ఏఐసీసీ నేతలు ఇవాళ సాయంత్రం 119 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. మీటింగ్‌ సానుకూలంగా జరిగిందని, సాయంత్రం జరిగే పార్టీ ఎలక్షన్‌ కమిటీ సమావేశంలో అభ్యర్థులను ఫైనల్‌ చేసి ప్రకటిస్తారని ఎంపీ కోమటిరెడ్డి మీడియాకు తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారు పూర్తయిందని తెలిపారు. స్క్రీనింగ్‌ కమిటీలో నిర్ణయించిన జాబితాను ఎలక్షన్‌ కమిటీకి పంపిస్తామని.. వారు పరిశీలించి ప్రకటన చేస్తారని తెలిపారు. మరోవైపు ఆశావహులంతా తమకు టికెట్‌ దక్కుతుందో లేదోనని ఢిల్లీలో ప్రదక్షిణలు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు