/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-14T195925.404.jpg)
Nagar Kurnool: నాగర్కర్నూలు పార్లమెంట్ అచ్చంపేటలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ కౌన్సిలర్ నిర్మల ఇంటిపై కాంగ్రెస్ నేతలు దాడికి దిగారు. ఈ గొడవలో నిర్మల భర్తకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. కర్రలతో నిర్మల ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని, ఈ దాడుల వెనుక ఎమ్మెల్యే వంశీకృష్ణ ఉన్నారని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపిస్తున్నారు. దాడి చేసిన వారిపై పీడీ యాక్టు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.