TS Congress: పటాన్ చెరు టికెట్ మార్పు: దామోదర రాజనర్సింహ సంచలన వ్యాఖ్యలు

పటాన్ చెరు అభ్యర్థిని కాంగ్రెస్ మారుస్తుందన్న ప్రచారం సాగుతున్న వేళ.. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టపడ్డ వారికి.,. కష్టకాలంలో పార్టీతో ఉన్న వారికే టికెట్ ఇవ్వాలన్నది తన అభిప్రాయమని స్పష్టం చేశారు.

author-image
By Nikhil
New Update
TS Congress: పటాన్ చెరు టికెట్ మార్పు: దామోదర రాజనర్సింహ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పటాన్ చెరు టికెట్ విషయంపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. నీలం మధుకు (Neelam Madhu) మద్దతుగా రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జగ్గారెడ్డి ఉండగా.. కాట శ్రీనివాస్ గౌడ్ కోసం మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) పట్టుబడుతున్నారు. ఇప్పటికే హైకమాండ్ పెద్దలతో ఈ విషయమై చర్చించిన దామోదర టికెట్ మార్పు ఖాయమన్న సంకేతాలు ఇస్తున్నారు. విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి ఈ రోజు ఉదయం హైకమాడ్ కు ఫోన్ చేసి టికెట్ మారిస్తే తన దారి తాను చూసుకుంటానని స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: TS BJP: బీజేపీ వేములవాడ టికెట్ ను మారుస్తుందా?.. ఈ ఆందోళనలు ఆగేదెలా?

ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి మాట నెగ్గుతుందా?.. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పంతం నెగ్గించుకుంటారా? అన్న అంశం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో ఆర్టీవీతో దామోదర రాజనర్సింహ ప్రత్యేకంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన వాళ్లు.. కష్టకాలంలో అండగా ఉన్న వాళ్లనే గుర్తించాలని స్పష్టం చేశారు. వారికే టికెట్ ఇవ్వాలన్నాది తన అభిప్రాయమన్నారు.

జగ్గారెడ్డి వ్యాఖ్యలపై తాను స్పందించాల్సిన అవసరం లేదన్నారు. పటాన్ చెరు టికెట్ విషయంలో హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాజనర్సింహ పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలు చూడండి

Advertisment
Advertisment
తాజా కథనాలు