AP: నన్ను మోసం చేశారు.. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఫిర్యాదు..!

నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై రియల్ ఎస్టేట్ వ్యాపారి లక్ష్మణ్ నాయక్ ఎస్పీ మల్లికా‌గార్గ్‌కి ఫిర్యాదు చేశారు. వెంచర్ అనుమతుల కోసం వివిధ దశల్లో తన దగ్గర రెండున్నర కోట్లు తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం కావాలని అధికారులను వేడుకుంటున్నారు.

AP: నన్ను మోసం చేశారు.. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఫిర్యాదు..!
New Update

Guntur: గత వైసీపీ ప్రభుత్వంలో తనకు జరిగిన అన్యాయంపై ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. తనకు న్యాయం జరగాలని అధికారులను వేడుకుంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై రియల్ ఎస్టేట్ వ్యాపారి లక్ష్మణ నాయక్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈపూరు మండలం ఊడిచెర్లకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి లక్ష్మణ నాయక్.. నరసరావుపేట మండలం కాకాని వద్ద తన వెంచర్ యొక్క రహదారి కోసం మాజీ ఎమ్మెల్యే రూ. 50 లక్షలు వసూలు చేశారన్నారు.

Also Read: సీఎం చంద్రబాబు ఇంటి కోసం లంచం డిమాండ్‌…సర్వేయర్‌ సస్పెండ్‌!

మధ్యవర్తి దండా శివరామకృష్ణకి రూ.30 లక్షలు ఇచ్చానని.. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఆయన ఇంట్లో మరో 20 లక్షలు ఇచ్చానని తెలిపారు. వెంచర్ అనుమతులు కోసం వివిధ దశల్లో వైసీపీ నేత ఇప్పల ధానారెడ్డి తన దగ్గర మొత్తం రెండున్నర కోట్లు తీసుకున్నారన్నారు. డబ్బులు అయినా ఇవ్వండి లేదా రహదారి అయినా చూపించండి అని అడిగితే తనను చంపేస్తామని బెదిరిస్తున్నారన్నారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితుడు లక్ష్మణ్ నాయక్ వేడుకున్నారు.

#guntur
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి