AP: వెంటనే చర్యలు తీసుకోండి.. ఇలా ఉంటే సహించేది లేదు.. కలెక్టర్ ఆగ్రహం..! తిరుపతిలో పారిశుధ్యలోపంపై కలెక్టర్ వెంకటేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే..తిరుపతి నగరంలోని స్కావెంజర్స్ కాలనీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తిరుపతి పారిశుద్ధ కార్మికుల పనితీరుపై మండిపడ్డారు. By Jyoshna Sappogula 05 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Tirupati: తిరుపతిలో పారిశుధ్యలోపంపై కలెక్టర్ వెంకటేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి మున్సిపల్ కమిషనర్ ను తీవ్రంగా హెచ్చరించారు. పారిశుద్ధ కార్మికుల పనితీరుపై మండిపడ్డారు. ఆశా వర్కర్ల పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి చెందారు. జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కలెక్టర్.. తిరుపతి నగరంలోని స్కావెంజర్స్ కాలనీలో తనిఖీలు చేశారు. Also Read: ఎస్సై ఆత్మహత్యాయత్నం.. భార్య ఏం చేసిందంటే? అయితే, కలెక్టర్ రాకను గుర్తించి అప్పటికప్పుడు రోడ్లను శుబ్బరం చేశారు కార్మికులు. ఇది గమనించిన కలెక్టర్ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రంలో పారిశుద్ధ్య లోపం ఉంటే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. సీజనల్ వ్యాధులు రాకుండా వెంటనే పటిష్టమైన చర్యలు చేపట్టాలని కమిషనర్కు సూచించారు. #tirupati మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి