తెలంగాణ(Telangana)లో ప్రస్తుతం చిత్ర విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు వరదలు.. మరోవైపు పొలిటికల్ హీట్.. ఇంకోవైపు ముంచుకొస్తోన్న అసెంబ్లీ ఎన్నికలు.. ఇలా విభిన్న పరిస్థితుల మధ్య ఇవాళ (జులై 31) మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ (cm kcr) అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ (cabinet) భేటీ కానుంది. ఈ మీటింగ్లో 40 నుంచి 50 అంశాలపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వరదలపైనే ఎక్కువగా చర్చ జరిగే ఛాన్స్ కనిపిస్తుంది . రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న సీఎం.. ఈ విషయంపై మంత్రులతో కలిసి సమీక్షంచనున్నారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు.. ఇకపై తీసుకోబోయే చర్యలపై చర్చించనున్నారు.
పూర్తిగా చదవండి..నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. ఏ అంశాలపై చర్చించనున్నారంటే?
ఇవాళ(జులై 31) తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సెక్రటేరియట్లో ఈ మీటింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ మీటింగ్లో దాదాపు 40 నుంచి 50 అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై మంత్రులతో చర్చించనున్నారు కేసీఆర్.
Translate this News: