ఇందిరమ్మ రాజ్యంలో అంతా ఆకలి బతుకులే అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీఎం కేసీఆర్. మళ్లీ ఇందరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ తెస్తానంటుందని విమర్శించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లో బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో రౌడీలు, గుండాలు గెలవకూడదన్న కేసీఆర్…ప్రజలు ఓటు అనే వజ్రాయుధంతో అడ్డుకోవాలన్నారు. వలసల ప్రాంతంగా ఉన్న పాలమూరు పరిస్థితి మార్చింది బీఆర్ఎస్ పార్టీనే అన్నారు. కాంగ్రెస్ పార్టీ వాల్మీకి బోయలను బీసీల్లో కలిపిందన్న సీఎం కేసీఆర్ మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వాల్మీక బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి బతుకులే అన్నారు. ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చేంత వరకు ఆకలి బతుకులే ఉన్నాయని అన్నారు.
పూర్తిగా చదవండి..Telangana Elections 2023: వాల్మీకి బోయలను ఎస్టీలుగా మార్చేదాక కేంద్రంతో కొట్లాడుడే: సీఎం కేసీఆర్..!!
ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి బతుకులే అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు సీఎం కేసీఆర్. మళ్లీ కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం తెస్తానంటుంది అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వాల్మీకి బోయలను గిరిజనుల్లో కలిపేంతవరకు కేంద్రంతో కొట్లాడుదామన్నారు.
Translate this News: