CM Jagan Attack Case: జగన్‌పై రాయి దాడి నిందితుడు మైనరా?.. మేజరా?.. కోర్టు ఏం చెప్పిందంటే!

AP: జగన్‌పై రాయితో దాడి చేసిన నిందితుడు సతీష్ మైనరా? లేదా మేజరా? అనే చర్చ నెలకొంది. ఈరోజు సతీష్‌ను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. కాగా సతీష్ మేజర్ కాదు మైనర్ అని నిందితుడి తరఫు లాయర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు కాసేపట్లో తీర్పును వెల్లడించనుంది.

CM Jagan Attack Case: సీఎం జగన్‌పై దాడి కేసు.. తీర్పు రిజర్వ్!
New Update

CM Jagan Attack Case: సీఎం జగన్ పై రాయితో దాడి చేసిన నిందితుడు సతీష్ మైనరా? లేదా మేజరా? అనే చర్చ నెలకొంది. ఈరోజు సతీష్ కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. కాగా సతీష్ మేజర్ కాదు మైనర్ అని నిందితుడి తరఫు లాయర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు కాసేపట్లో తీర్పును వెల్లడించనుంది.

ALSO READ:  వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతకు తీవ్ర అస్వస్థత

నిందితుడి తరఫున లాయర్ వాదనలు..

* పోలీసులు ఐదు రోజుల క్రితం సతీష్ ను అదుపులోకి తీసుకుని ఇవాళ కోర్టులో ప్రవేశ పెట్టారు

* అదుపులోకి తీసుకున్నా రోజుకు ఇవాళ్టికి చాలా వ్యత్యాసం ఉంది

* ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న సతీష్ మైనర్

* నిందితుడి ఆధార్ కార్డును పరిగణలోకి తీసుకోవాలి

* పుట్టిన తేదీలో వ్యత్యాసం ఉంది

* సతీష్ మేజర్ కాదు మైనర్

* ఆధార్ కార్డులో ఉన్న డేట్ అఫ్ బర్త్ ని కాకుండా... స్కూల్లో ఎంట్రీ అయిన డేట్ అఫ్ బర్త్ .. మున్సిపల్ కార్యాలయం వచ్చిన డేట్ అఫ్ ఎంట్రీ మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని కోర్టు తెలిపింది.

* సతీష్ సతీష్ అనే వ్యక్తి నేర చరిత్ర కలిగిన వ్యక్తి కాదు

* రాయితో కొట్టినంత మాత్రాన హత్యాయత్నం కేసు పెడతారా?

* గతంలో ఎక్కడైనా ఇలాంటి సెక్షన్స్ లలో కేసు నమోదు చేశారా?

* వాదనలు విన్న కోర్టు.. కాసేపట్లో తీర్పు వెల్లడించనుంది.

#cm-jagan-attack-case
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe