Anna Canteens: చంద్రబాబు కీలక నిర్ణయం.. ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లు ప్రారంభం

AP: అన్న కాంటీన్లపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్న కాంటీన్లను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పాత అన్న క్యాంటీన్ భవనాలకు మరమ్మతులు చేస్తున్నారు. ఆహార సరఫరాకు సంబంధించి టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది.

New Update
Anna Canteens: చంద్రబాబు కీలక నిర్ణయం.. ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లు ప్రారంభం

Anna Canteens: అన్న కాంటీన్లపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్ లో అన్న కాంటీన్లను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పాత అన్న క్యాంటీన్ భవనాలకు మరమ్మతులు చేస్తున్నారు. ఈ భవనాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఆహార సరఫరా కు సంబంధించి టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది. వచ్చే నెల ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటిన్ ల ద్వారా పేదల కడుపు నింపాలనే ఆలోచనతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాగా రాష్ట్ర విభజన సమయంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఆనాడు అన్న క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. కేవలం రూ.5 లకే ప్రజలకు ఆహారాన్ని అందించింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందింది. కొత్తగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. ఆ తరువాత అన్న క్యాంటీన్లను మూసివేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి టీడీపీ అధికారంలోకి రావడంతో సీఎం అయిన చంద్రబాబు అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు కంకణం కట్టుకున్నారు.

Advertisment
తాజా కథనాలు