హైదరాబాద్‌లోనే హర్షసాయి.. ఆ హోటల్‌లో బస!

హర్షసాయి హైదరాబాద్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అతడు సెప్టెంబర్ 27, 28న సికింద్రాబాద్‌లోని GN ఇంటర్నేషనల్‌ హోటల్‌లోని రూమ్ నెంబర్ 206లో బస చేసినట్లు సమాచారం. అతడి స్నేహితుడు ఇమ్రాన్ పేరుతో హోటల్ రూమ్ బుక్ చేసినట్లు తెలుస్తోంది.

New Update

ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారుండరు. కష్టం అన్నవారికి, కష్టం ఉన్నవారికి సహాయం చేస్తూ వాటిని వీడియోలుగా తీసి చేతులారా డబ్బులు సంపాదిస్తూ బాగా పాపులర్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై ఎన్నో విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. కానీ వాటిని పట్టించుకోకుండా ముందుకు దూసుకుపోయాడు. అయితే ఇప్పడీ పేరు మారుమోగిపోతుంది. 

ఓ యువతి హర్షసాయిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమ పేరుతో మోసం చేశాడని.. రూ.2 కోట్లు తీసుకుని వాడుకున్నాడని ఫిర్యాదులో తెలిపింది. అయితే ఆ అమ్మాయి కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చి నిర్మాతగా మారింది. ఆపై అందం, అభినయంతో హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో కూడా చేసింది. 

అలా ఫుల్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ ఓటీటీలో కంటెస్టెంట్‌గా కూడా చేసింది. అలా మరింత పాపులారిటీ పొందింది. ఇక ఈ బిగ్ బాస్ అనంతరం హర్షసాయిని కలిసి అతనితో ఓ సినిమా కూడా ప్లాన్ చేసింది. అదే ‘మెగా’. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక అదే రెస్పాన్స్‌తో మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. ఇంతలో హర్షసాయి నిజస్వరూపాన్ని ఆ యువతి బట్టబయలు చేసింది. 

రూ.2 కోట్లు తీసుకున్నాడు

పెళ్లి చేసుకుంటానని నమ్మించి హర్షసాయి తన వద్ద నుంచి రూ.2 కోట్లు తీసుకున్నాడని తెలిపింది. తనను వాడుకుని వదిలేశాడని తెలిపింది. అంతేకాకుండా డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి తనను రేప్ చేశాడని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు హర్షసాయిపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం హర్షసాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే హర్షసాయి ఆచూకీ పోలీసులకు దొరకలేదు. 

హైదరాబాద్‌లోనే హర్షసాయి 

తాజా సమాచారం ప్రకారం.. హర్షసాయి హైదరాబాద్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అతడు సెప్టెంబర్ 27, 28న సికింద్రాబాద్‌లోని GN ఇంటర్నేషనల్‌ హోటల్‌లోని రూమ్ నెంబర్ 206లో బస చేసినట్లు సమాచారం. అంతేకాకుండా తనపై ఎప్పుడైతే లైంగిక ఆరోపణలు వచ్చాయో.. అప్పుడు అదే హోటల్ నుంచి ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ వివాదంలోకి ఇప్పుడు అతడి ఫ్రెండ్ ఇమ్రాన్‌ కూడా ఇరుక్కున్నట్లు తెలుస్తోంది.

సికింద్రాబాద్ చిలకలగూడకు చెందిన ఇమ్రాన్, హర్షసాయి మంచి స్నేహితులు. వీరిద్దరూ ఆ హోటల్‌లో కలిసినట్లు సమాచారం. అంతేకాకుండా హర్షసాయి బస చేసిన హోటల్ రూమ్‌ను ఇమ్రాన్ పేరుతో బుక్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా హర్షసాయి వివాదం రోజు రోజుకూ ముదురుతుంది. రాజ్ తరుణ్, జానీ మాస్టర్ తర్వాత లిస్ట్‌లో హర్షసాయి పేరు చేరిపోయింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు