Urvashi Rautela: బిగ్ షాక్.. ఆ కేసులో ఇరుక్కున్న బాలయ్య బ్యూటీ!

ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా వివాదంలో చిక్కుకుంది. ఆన్లైన్ బెట్టింటి యాప్ కేసులో ఈడీ ఆమెకు  సమన్లు పంపించింది. సెప్టెంబర్ 16న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ఊర్వశీ  విచారణకు హాజరుకావాల్సి ఉంది.

New Update
Urvashi Rautela

Urvashi Rautela: ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా వివాదంలో చిక్కుకుంది. ఆన్లైన్ బెట్టింటి యాప్ కేసులో ఈడీ ఆమెకు  సమన్లు పంపించింది. సెప్టెంబర్ 16న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ఊర్వశీ  విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఊర్వశీ తో పాటు  తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మీమీ చక్రవర్తికి కూడా ఈడీ సమన్లు పంపింది. ఆమె సెప్టెంబర్ 15న విచారణకు హాజరుకానున్నారు. వీరిద్దరినీ 1xBet యాప్ ప్రమోషన్స్  కేసుకు సంబంధించి ఈడీ విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయని, వాటికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ఈడీ వీరిని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌తో సహా పలువురు ప్రముఖులను కూడా  ఈడీ ప్రశ్నించింది.

ఇదిలా ఉంటే  ఊర్వశి బాలయ్య డాకు మహారాజ్ సినిమాతో తెలుగులో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో బాలయ్యతో  ధబిడి.. దిబిడి పాటతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. 

Advertisment
తాజా కథనాలు