ఓటీటీలో కార్తీ, అరవింద్ స్వామి ‘స‌త్యం సుంద‌రం’.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

కోలీవుడ్ స్టార్ కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో నటించిన లేటెస్ట్ మూవీ 'మెయ్యళగన్‌'. తెలుగులో ‘స‌త్యం సుంద‌రం’ పేరుతో విడుదలైంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది. అక్టోబర్ 27 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

New Update

Sathyam Sundaram:  కోలీవుడ్ స్టార్ కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో నటించిన లేటెస్ట్  ఎమోషనల్ కామెడీ ఎంటర్ టైనర్ 'మెయ్యళగన్‌'. ఈ చిత్రాన్ని తెలుగులో ‘స‌త్యం సుంద‌రం’ అనే పేరుతో విడుదల చేశారు. కార్తీ హోమ్ బ్యానర్ 2డీ ఎంటర్ టైన్మెంట్స్ పై హీరో సూర్య-జ్యోతిక నిర్మించిన ఈ చిత్రం గత నెల 28న తెలుగులో విడుదల కాగా,  27న తమిళంలో రిలీజ్ అయ్యింది. అనాటి రోజులను గుర్తు చేస్తూ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా సాగిన ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన బాక్స్ ఆఫీస్ వద్ద  రూ.50 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. 

Also Read:  అనుష్క కాదు, కాజల్ కాదు.. ప్రభాస్ కి సరైన జోడీ ఈ హీరోయినే!

ఓటీటీ రిలీజ్ 

తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్ ఫ్లిక్స్ పోస్టర్ రిలీజ్ చేసింది. తమిళం, తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.  ఈ సూపర్ హిట్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ ను థియేటర్లలో మిసైనా వాళ్ళు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. 

Also Read: 'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్'! మెగాస్టార్ ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే

స్టోరీ 

ఇద్దరి స్నేహితుల కథాంశంతో ఈ సినిమా రూపొందింది.  మూవీలో కార్తీ,అరవింద్‌స్వామి  మధ్య ఎమోషనల్ సీన్స్ , కామెడీ హైలైట్ గా నిలిచాయి.  ఈ చిత్రంలో రాజ్ కిర‌ణ్, శ్రీదివ్య, స్వాతి, దేవదర్శిణి, జయప్రకాశ్‌, శ్రీరంజిని తదితరులు కీలక పాత్రలు పోషించారు. 96ఫ్రేమ్ గోవింద్ వసంత్ సంగీతం అందించారు. 

 

Also Read : అన్ స్టాపబుల్ లో జూ.ఎన్టీఆర్ ప్రస్తావన.. బాలయ్య, చంద్రబాబు మధ్య హాట్ డిస్కషన్?

Advertisment
Advertisment
తాజా కథనాలు