/rtv/media/media_files/2026/01/22/rajinikanth-2026-01-22-10-20-33.jpg)
Rajinikanth
Rajinikanth: కోయంబత్తూరులోని ప్రముఖ తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ (TNAU)లో 1975 నుంచి 1979 మధ్య చదువుకున్న పూర్వ విద్యార్థుల భారీ రీయూనియన్ కార్యక్రమం జరిగింది. దాదాపు 45 ఏళ్ల తర్వాత ఒకేచోట కలిసిన పాత మిత్రులు, తమ కాలేజీ రోజుల జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసుకున్నారు.
Rajinikanth Emotional Video
Thalaivar's latest about his old friends and friendship ❤️❤️ @rajinikanth
— Abbishekh Raaja (@abbi0410) January 21, 2026
என் பழைய friends டேய் சிவாஜி என்னடா எப்படி டா இருக்க nu கேகுறப்போ அவ்வளவு சந்தோஷமா இருக்கும் 😍😍#Rajinikanth#FriendshipGoalspic.twitter.com/oMfYyGttqs
ఈ సమావేశానికి మాజీ డీజీపీ శైలేంద్రబాబు ఐపీఎస్, మాజీ చీఫ్ సెక్రటరీ ఇరయన్బు ఐఏఎస్ సహా అదే విభాగంలో చదువుకున్న పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ, పాత స్నేహితులను చూసినప్పుడు అందరి కళ్లలోనూ ఆనందం, భావోద్వేగం కనిపించింది.
ఈ రీయూనియన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సూపర్ స్టార్ రజినీకాంత్ పంపిన వీడియో. పూర్వ విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ,
“దాదాపు 50 ఏళ్ల తర్వాత మీరు అందరూ మళ్లీ కలవడం చాలా ఆనందంగా ఉంది. పాత స్నేహితులను చూసినప్పుడు వచ్చే సంతోషానికి కొలమానం ఉండదు. ఈ కాలేజీలో చదువుకున్న శైలేంద్రబాబు, ఇరయన్బు లాంటి వారు ఈరోజు సమాజంలో గొప్ప స్థాయిలో ఉన్నారు అనేది గర్వకారణం” అని అన్నారు.
స్నేహ బంధాల గురించి మాట్లాడుతూ రజినీకాంత్ తన జీవితంలోని ఒక విషయాన్ని కూడా పంచుకున్నారు.
“నేను ఎంత బిజీగా ఉన్నా, ప్రతి ఆరు నెలలకు ఒకసారి బెంగళూరుకు వెళ్తాను. అక్కడ నా పాత స్నేహితులను కలుస్తాను. వారు నా తోడు డ్రైవర్లు, కండక్టర్లు. నేను ఇప్పుడు ‘రజినీకాంత్’ అయినా, వారు నన్ను ప్రేమగా ‘డే శివాజీ’ అని పిలిచినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేను. నా అసలు పేరు కూడా నేను మరిచిపోయినా, వాళ్లు పిలిచే ఆ పేరు మాత్రం నా హృదయానికి చాలా దగ్గర” అని చెప్పారు.
ఇలాంటి రీయూనియన్లతో ఆగిపోవద్దని, అవకాశం దొరికినప్పుడల్లా స్నేహితులను కలవాలని రజినీకాంత్ సూచించారు. అలా కలవడం వల్ల జీవితం కొత్త ఉత్సాహంతో నిండుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమం అక్కడికి వచ్చిన పూర్వ విద్యార్థులందరికీ మధుర జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, జీవితాంతం గుర్తుండిపోయే ఒక అనుభూతిగా నిలిచింది.
Follow Us