ఓటీటీలోకి నారా రోహిత్ పొలిటికల్ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ పొలిటికల్ డ్రామా 'ప్రతినిధి 2'. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి 'ఆహా' లో స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను 'ఆహ' తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

New Update

Prathinidhi 2:  నారా రోహిత్ హీరోగా నటించిన లేటెస్ట్ పొలిటికల్ డ్రామా 'ప్రతినిధి2'. 2014లో వచ్చిన 'ప్రతినిధి' సీక్వెల్ గా ఈ చిత్రం  రూపొందింది.  పాత్రికేయుడు మూర్తి దేవప్తపు దర్శకత్వం వహించిన ఈ మూవీని రా ఎంటర్‌టైన్‌మెంట్స్,  రానా ఆర్ట్స్ బ్యానర్స్ పై కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట,  సురేంద్రనాథ్ బొల్లినేని సంయుక్తంగా నిర్మించారు. ఈ ఏడాది మేలో విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. 

ప్రతినిధి 2 ఓటీటీ రిలీజ్ 

తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా' లో ఈ నెల 27నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ  'ఆహా' తమ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేసింది. 'ప్రశ్నించేందుకు ప్రతినిధి వస్తున్నాడు' అంటూ ఓటీటీ డేట్ అనౌన్స్ చేసింది. 

ప్రతినిధి 2 స్టోరీ 

సినిమాలో  చేత‌న్(నారా రోహిత్)  నిజాన్ని నిర్భయంగా ప్రశ్నించే   జర్నలిస్ట్ పాత్రను పోషించాడు. అయితే  హీరో చిన్నతనంలో జరిగిన కొన్ని సంఘటనలే  ఆయన జీవితానికి మార్గనిర్దేశం చేస్తాయి. ఈ క్రమంలో చేతన్ ఓ ఫ్రీ లాన్స్ జర్నలిస్టుగా తన వృత్తిని మొదలు పెడతాడు. అలా చేతన్ జీవితం కొనసాగుతుండగా ఊహించని విధంగా ఎన్‌.ఎన్‌.సి అనే ఓ పెద్ద న్యూస్ ఛానెల్ అతన్ని కంపెనీ  CEO గా నియమిస్తుంది.  ఆ తర్వాత చేతన్ తన చాకచక్యంతో ఎంతో మంది  రాజకీయ నాయకుల అన్యాయాలు, అక్రమాలను బట్టబయలు చేస్తాడు. ఇక  అదే సమయంలో ముఖ్య‌మంత్రి ప్ర‌జాప‌తి (స‌చిన్ ఖేడ్‌కర్‌) పై హత్య ప్రయత్నం జరుగుతుంది. మరి ఈ హత్య ప్రయత్నం వెనుక ఉన్నది ఎవరు..? జర్నలిస్ట్ చేతన్ దీని వెనుక ఉన్న నిజాలను ఎలా బయటకు తీసుకొచ్చాడు?  అనేది సినిమా కథ. 

Advertisment
Advertisment
తాజా కథనాలు