Chiranjeevi MSG: 'మన శంకర వరప్రసాద్ గారు' బిజినెస్ లెక్కలివే..! యూఎస్‌లో బుకింగ్స్ రచ్చ రచ్చ!!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో, తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా మెరవనుంది. ఇప్పటికే, అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ రూ.1 కోటి పైగా రాబట్టింది.

New Update
Chiranjeevi MSG

Chiranjeevi MSG

Chiranjeevi MSG: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా జనవరి 12, 2026న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ సినిమా అంటే పండుగ వాతావరణం రావడం సహజం. పైగా సంక్రాంతి సీజన్ కావడంతో సినిమాపై క్రేజ్ మరింత పెరుగుతోంది.

ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదాత్మక సినిమాలు తీయడంలో ఆయనకు మంచి పేరు ఉంది. అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డ్, చిరంజీవి సంక్రాంతి సెంటిమెంట్ ఈ సినిమాకు బలంగా మారాయి. ఈసారి పోటీ సినిమాలు ఎక్కువగా ఉన్నా, ‘మన శంకర వర ప్రసాద్ గారు’కి ప్రత్యేకమైన అడ్వాంటేజ్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే, నార్త్ అమెరికాలో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అక్కడ ఈ సినిమా మంచి జోరు చూపిస్తోంది. ఇతర భారీ పాన్ ఇండియా సినిమాలతో పోల్చినా భారీ స్థాయిలో బుకింగ్స్ నమోదు అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, అమెరికాలో ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో సినిమా 120 వేల డాలర్ల మార్క్‌ను దాదాపు చేరుకుంది. ఇండియన్ కరెన్సీలో ఇది రూ.1 కోటికి పైగా గ్రాస్ కావడం విశేషం.

ఇంకా సినిమా రిలీజ్‌కు దాదాపు 9 రోజులు సమయం ఉండటంతో, ఈ నంబర్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత బుకింగ్స్ మరింత వేగం పుంజుకుంటాయని అంచనా. సినిమా ట్రైలర్‌ను జనవరి 4, 2026న విడుదల చేయనున్నారు. ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే, ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద సంఖ్యలో థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని చెప్పాలి.

ఈ సినిమాలో చిరంజీవి తొలిసారి పూర్తి స్థాయి కామెడీ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయనకు జోడీగా నయనతార నటిస్తోంది. మరో ముఖ్య పాత్రలో విక్టరీ వెంకటేష్ కనిపించబోతుండడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది.

సినిమాలో కేథరిన్ ట్రెసా, సునీల్, వీటీవీ గణేష్, రేవంత్, హర్ష వర్ధన్, సచిన్ ఖేడేకర్, అభినవ్ గోమటం వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు మంచి బలంగా నిలవనున్నాయి.

ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. మొత్తం మీద, ‘భోలా శంకర్’ తర్వాత చిరంజీవికి ఈ సినిమా ఒక బలమైన కంబ్యాక్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తే, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు