Lavanya Case: లావణ్య కేసులో ట్విస్ట్ ..రాజ్ తరుణ్ పై దొంగతనం కేసు..!

హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. రాజ్ తరుణ్, మాల్వీ తన ఇంట్లో 12 లక్షల బంగారం దొంగతనం చేశారని లావణ్య నార్సింగ్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. తన మంగళ సూత్రాన్ని కూడా ఎత్తుకెళ్లారని. ఎలాగైనా తనకు న్యాయం చేయాలని ఆరోపించింది.

New Update
raj tarun- lavanya

Raj Tarun- Lavanya

Raj Tarun- Lavanya: టాలీవుడ్ హీరో లావణ్య- రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవలే లావణ్య తన ప్రియుడు రాజ్ తరుణ్- నటి మాల్వీ మల్హోత్రాను ముంబైలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. వీరిద్దరూ రహస్యంగా ముంబైలో ఉంటున్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లిన లావణ్య ఇద్దరినీ పట్టుకుంది. అక్కడే మాల్వీతో వాగ్వాదానికి దిగింది. తన రాజ్ ను తనకు ఇవ్వమని మాల్విని దూషించింది. తనను మోసం చేసి మాల్వితో సహజీవనం చేస్తున్నాడని ప్రియుడు రాజ్ తరుణ్ పై ఆరోపణలు చేసింది.

రాజ్ తరుణ్ పై దొంగతనం కేసు

ఇది ఇలా ఉంటే తాజాగా లావణ్య కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా తన ఇంట్లో దొంగతనం చేశారని సంచలన ఆరోపణలు చేసింది లావణ్య. తాను ఇంట్లో లేని సమయంలో రాజ్ తరుణ్- మాల్వీ రూ.12 లక్షల విలువైన బంగారాన్ని ఎత్తుకెళ్లారని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అంతే కాదు తన మంగళ సూత్రాన్ని కూడా మంగళ సూత్రాన్ని కూడా దొంగలించారని ఆరోపించింది. ఎలాగైనా తనకు న్యాయం చేయమని సినీ రంగ యూనియన్‌ సభ్యులను కోరతానని లావణ్య తెలిపింది. ఇక రాజ్ తరుణ్ - లావణ్య ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే నార్సింగ్ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

ఇది ఇలా ఉంటే  లావణ్య బాయ్ ఫ్రెండ్ అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మస్తాన్‌ సాయి రీసెంట్ గా డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం షాకిచ్చింది. విజయవాడలో SEB ఆపరేషన్ లో భాగంగా దొరికిన డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి పేరును A4గా నమోదు చేశారు. 

Advertisment
తాజా కథనాలు