సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు మొదటగా బసవతారకం అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నేళ్ళకు బసవతారకం క్యాన్సర్ తో మరణించించారు. భార్య చనిపోయిన తర్వాత రాజకీయాల్లో ఒత్తిడి, ఒంటరితనం అనుభవిస్తున్న సమయంలో లక్ష్మీపార్వతికి దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే ఆమెను రెండవ వివాహం చేసుకున్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మొదట ఇందిరాదేవిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఐదుగురు సంతానం. ఆ తర్వాత మళ్ళీ నటి విజయ నిర్మలను రెండో పెళ్లి చేసుకున్నారు.
సీనియర్ హీరో మోహన్ బాబుకు మొదటగా శ్రీ విద్యా అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం మంచు లక్ష్మి, విష్ణు. ఆ తర్వాత కొన్ని కారణాలతో మొదటి భార్య మరణించడంతో.. ఆమె సోదరిని రెండవ వివాహం చేసుకున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు అక్కినేని నాగార్జున మొదటగా దగ్గుబాటి రామానాయుడు కుమార్తె వేంకేటేష్ చెల్లెలు లక్ష్మీని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెతో విడాకులు తీసుకున్న నాగార్జున నటి అమలను రెండవ వివాహం చేసుకున్నారు.
పవన్ కళ్యాణ్ నందిని అనే అమ్మాయిని మొదటి పెళ్లి చేసుకున్నారు. ఆమెతో విభేదాల కారణంగా విడిపోయారు. అనంతరం రేణు దేశాయిని వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. పిల్లలు జన్మించిన తర్వాత తనతో విభేదాలు రావడంతో పవన్ కళ్యాణ్ మూడో వివాహం చేసుకున్నారు.
మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ మొదటగా ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన రెండు సంవత్సరాల్లోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మనోజ్ రాజకీయ ప్రముఖుడు భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనికను ప్రేమ వివాహం చేసుకున్నారు.
అక్కినేని నాగచైతన్య.. 2017 లో హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత నాలుగేళ్లకు సమంతతో విడాకులు తీసుకోని.. ఇటీవలే హీరోయిన్ శోభిత దూళిపాళను రెండో వివాహం చేసుకున్నాడు.