/rtv/media/media_files/2025/10/09/baahubali-the-epic-2025-10-09-07-47-03.jpg)
Baahubali: The Epic
Prabhas: ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్(Indias Biggest Super Star Prabhas) అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ లాంటి టాప్ హీరోలతో సమానంగా మార్కెట్ కలిగిన నటుడిగా ఎదిగాడు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ స్థాయి ఒక్కసారిగా మారిపోయింది. అంతకుముందు వరకు టాలీవుడ్లో నాలుగు లేదా ఐదు స్థానాల్లో ఉన్న ప్రభాస్, ఆ సినిమా తర్వాత నెంబర్ వన్ హీరోగా మారాడు.
అయితే ప్రభాస్ ఈ స్థాయికి ఎదగడం టాలీవుడ్లో కొంతమందికి నచ్చలేదా? అతని ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు మళ్లీ వినిపిస్తున్నాయి. నిజానికి ఈ తరహా మాటలు ఇప్పటివి కాదు. గతంలో కూడా ప్రభాస్ను టార్గెట్ చేస్తూ కథనాలు వచ్చాయి.
తార సితార అని అప్పట్లో స్పైసీ ఆర్టికల్స్ రాసే మ్యాగజిన్ ఉండేది. అందులో ఛత్రపతి రిలీజ్ అయిన రెండు నెలలకు వచ్చిన ఆర్టికల్ ....#Prabhaspic.twitter.com/Cof2szMFFp
— Skydream Media (@SkydreamMedia) January 28, 2026
ఇటీవల ప్రభాస్ నటించిన 'ది రాజాసాబ్' సినిమాపై వచ్చిన నెగటివ్ ప్రచారం ఈ చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది. సినిమా రిలీజ్ అవ్వకముందే డిజాస్టర్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. సినిమా కథలో లోపాలు ఉన్న మాట వాస్తవమే. దర్శకుడు మారుతి కొత్త పాయింట్ తీసుకున్నా, ప్రభాస్ స్టార్ ఇమేజ్ను పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడని విమర్శలు వచ్చాయి. అయినా కూడా కొత్తగా ప్రయత్నించిన ఓ స్టార్ హీరోకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని అభిమానులు భావిస్తున్నారు.
ఈ కారణంగానే ప్రభాస్ ఎదుగుదలను కొందరు ఓర్చుకోలేకపోతున్నారనే వాదన మళ్లీ వినిపిస్తోంది. ఆసక్తికరంగా, ఇదే తరహా ఆరోపణలు గతంలో కూడా వచ్చాయి. ఛత్రపతి సినిమా విడుదలైన రెండు నెలల తర్వాత ఓ ప్రముఖ మ్యాగజైన్లో ప్రభాస్పై ఓ కథనం వచ్చింది. అందులో ప్రభాస్ లుక్స్, ఫిజిక్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయని, నటనలో ఇంకా మెరుగుపడితే అతనికి అడ్డుకట్ట ఉండదని రాసింది. అంతేకాదు, కొంతమంది పెద్ద హీరోలు ప్రభాస్ ఎదుగుదలను ఆపేందుకు చర్చలు చేసినట్లు కూడా అందులో పేర్కొన్నారు. ఇప్పుడు అదే కథనం మరోసారి సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది.
ఇదిలా ఉండగా, 'ది రాజాసాబ్' సినిమా ఇప్పుడు ఓటీటీకి రాబోతోంది. జనవరి 9, 2026న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డిజిటల్ హక్కులను జియో హాట్స్టార్ సుమారు రూ.80 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి రెండో వారంలో లేదా చివరి వారంలో స్ట్రీమింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
ఫాంటసీ, హారర్, కామెడీ కలయికగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. సంజయ్ దత్ కీలక పాత్రలో నటించగా, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించాడు.
భారీ బడ్జెట్తో తెరకెక్కిన 'ది రాజాసాబ్' తొలి రోజు మంచి ఓపెనింగ్ సాధించినప్పటికీ, నెగటివ్ టాక్ కారణంగా కలెక్షన్లు తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.200 కోట్లకు పైగా వసూలు చేసినా, బ్రేక్ ఈవెన్ టార్గెట్ను చేరుకోలేకపోయింది. అయినా ప్రభాస్ నటనకు మాత్రం మంచి స్పందన వచ్చింది.
సినిమా చివర్లో సీక్వెల్కు సంబంధించిన హింట్ ఇవ్వడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ఓటీటీలో సినిమా విడుదల కావడంతో మరోసారి ప్రేక్షకులు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.
Follow Us