Bigg Boss Telugu 8: అతని హగ్ నచ్చలేదు.. ఏడ్చేసిన యష్మీ!

బిగ్ బాస్ 8 లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ప్రోమోలో మణికంఠ తాను యష్మీపై వేసిన నామినేషన్ ను ఉద్దేశించి ఆమెకు సారీ చెప్తూ హగ్ చేసుకుంటాడు. కానీ యష్మీ.. మణికంఠ చాలా ఫేక్ అతని హగ్‌ కంఫర్టబుల్‌గా లేదు, చెప్పిన అర్థం చేసుకోవట్లేదు అని పృథ్వీతో ఎమోషనల్ అయ్యింది.

New Update
bigg boss

bigg boss 8

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 రోజు రోజూ ఆసక్తికరంగా కొనసాగుతుంది. గత వారం శేఖర్ భాష షాకింగ్ ఎలిమినేషన్ తో బిగ్ బాస్ గురించి సోషల్ మీడియాలో మరింత బజ్ పెరిగింది. జనాల ఓట్స్ తో కాకుండా హౌస్ మేట్స్ నిర్ణయంతో శేఖర్ భాషను ఎలిమినేట్ చేయడాన్ని ప్రేక్షకులు అన్యాయంగా భావించారు. కావాలనే బిగ్ బాస్ భాషను ఎలిమినేట్ చేశాడని కామెంట్స్ పెడుతున్నారు.

ఇక ఆదివారం శేఖర్ భాష ఎలిమినేషన్ తర్వాత నిన్న సోమవారం జరిగిన ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ అంతా ఈ వారం నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ ప్రక్రియలో యష్మీ- మణికంఠ మధ్య ఎక్కువగా ఆర్గుమెంట్ జరిగింది. నిన్న నామినేషన్ ప్రక్రియ ముగిసే సరికి సీత, యష్మీ, మణికంఠ, ప్రేరణ, విష్ణుప్రియ, అభయ్ నవీన్, పృథ్వీ ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయ్యారు.

హగ్ నాకు నచ్చలేదు.. ప్రోమోలో యష్మీ ఏడుపులు

తాజాగా బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ప్రోమోలో యష్మి మణికంఠ విషయంలో కోపంగా ఉన్నట్లు చూపించారు. మణికంఠ నిన్న నామినేషన్ ప్రక్రియలో యష్మీతో గొడవకు సంబంధించి ఆమెకు సారీ చెప్తూ.. హగ్ చేసుకుంటాడు. నామినేషన్ విషయాలు మనసులో పెట్టుకోకు ప్లీజ్ అని యష్మీ హగ్ ఇస్తాడు. కానీ యష్మీ మణికంఠ సారీ ఏ మాత్రం యాక్సెప్ట్ చేయలేదు అన్నట్లుగా ప్రోమో చూస్తే అర్థమవుతుంది. మణి సారీ చెప్పిన తర్వాత పృథ్వీ దగ్గరకు వెళ్లిన యష్మీ.. వాడు మొత్తం ఫేక్ అనిపిస్తున్నాడు. అతను హగ్ చేసుకోవడం నాకు కంఫర్టబుల్‌గా లేదు. అది చెప్పిన అర్థం చేసుకోవ‌ట్లేదు.. నేను ఉన్నంత వరకు వాడిని నామినేట్ చేస్తూనే ఉంటాను అని ఎమోషనల్ అవుతుంది.

ఆ తర్వాత ఇంటి సభ్యులంతా 'ఫొటో పెట్టు.. ఆగే టట్టు' అనే టాస్క్ లో పాల్గొనడం ప్రోమోలో చూపించారు. ఈ టాస్క్ లో నిఖిల్ క్లాన్ నుంచి పృథ్వీ, అభయ్ క్లాన్ నుంచి నబీల్ గేమ్ ఆడారు. ఇందులో నబీల్, పృథ్వీ గట్టిగానే పోటీ ఇచ్చినట్లు కనిపించింది. మరి టాస్క్ లో ఎవరు గెలిచారు..? ఎవరు ఓడిపోయారో తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే.

Advertisment
తాజా కథనాలు