Tollywood: పెళ్లి పీటలు ఎక్కనున్న 'ఛత్రపతి'.. అన్నకి మంచిరోజులొచ్చాయి రోయ్!

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన కావ్య రెడ్డి అనే అమ్మాయినిపెళ్లి చేసుకోనున్నట్టు తెలుస్తోంది. ఆమె కుటుంబం న్యాయవాద రంగానికి చెందినదిగా సమాచారం.

New Update
Bellamkonda Sai Srinivas

Bellamkonda Sai Srinivas

Tollywood: ప్రస్తుతం టాలీవుడ్‌లో పెళ్లి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. చాలా కాలంగా బ్యాచిలర్స్‌గా ఉన్న హీరోలు, హీరోయిన్లు ఒక్కొక్కరిగా పెళ్లి చేసుకుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నలు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. అలాగే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ కూడా ఈరోజు పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో మరో టాలీవుడ్ హీరో పెళ్లి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారింది.

Bellamkonda Sai Srinivas Marriage

ఆ హీరో మరెవరో కాదు.. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తండ్రి సినిమా నిర్మాత కావడంతో ఆయనకు ఇండస్ట్రీలోకి రావడం చాలా సులభమైంది. భారీ స్థాయిలో ఆయనను హీరోగా పరిచయం చేశారు. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘అల్లుడు శీను’ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించగా, తమన్నా ప్రత్యేక పాటలో కనిపించడం విశేషం. తొలి సినిమాకే మంచి ఓపెనింగ్స్ రావడంతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్‌ను కొనసాగించారు. స్పీడున్నోడు, జయ జానకీ నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు, అల్లుడు అదుర్స్, భైరవం వంటి సినిమాల్లో నటించారు. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన ప్రభాస్ సినిమా ‘ఛత్రపతి’ను హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్‌లో కూడా అడుగు పెట్టారు. కానీ ఆ సినిమా అక్కడ ఆశించిన విజయం సాధించలేదు. తర్వాత చేసిన కొన్ని సినిమాలకు కూడా మిక్స్‌డ్ టాక్ మాత్రమే వచ్చింది. ప్రస్తుతం టైసన్ నాయుడు, హైందవ అనే సినిమాల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్నారు.

ఇక ఆయన వ్యక్తిగత జీవితంపై కూడా గతంలో చాలా గాసిప్స్ వచ్చాయి. కొంతమంది హీరోయిన్లతో ఆయన డేటింగ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ అవి నిజం కాలేదు. ఇప్పుడు మాత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి గురించి కొత్త వార్తలు వినిపిస్తున్నాయి.

ఫిలింనగర్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని చెబుతున్నారు. ఈ పెళ్లికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే ఇది ప్రేమ వివాహమా లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లా అనే విషయం గురించి ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

కొన్ని వార్తల ప్రకారం, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి చేసుకోబోయే యువతి పేరు కావ్య రెడ్డి అని చెబుతున్నారు. ఆమె హైదరాబాద్‌కు చెందిన కుటుంబానికి చెందినదని సమాచారం. ఆమె కుటుంబానికి సినిమా రంగంతో సంబంధం లేదని తెలుస్తోంది. కావ్య రెడ్డి కుటుంబం న్యాయవాద రంగానికి చెందినదిగా చెబుతున్నారు. ఆమె తండ్రి లాయర్ కాగా, ఆమె తాతగారు జడ్జిగా పనిచేసినట్లు సమాచారం.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిలకు ముందే పరిచయం ఉందని, ఆ పరిచయం తర్వాత ప్రేమగా మారిందని కొన్ని వార్తలు చెబుతున్నాయి. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. త్వరలోనే హైదరాబాద్‌లో వీరి నిశ్చితార్థం జరగవచ్చని కూడా టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అయితే ఈ విషయంపై బెల్లంకొండ కుటుంబం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అందువల్ల ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం మాత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది.

Advertisment
తాజా కథనాలు