'అఖండ 2 - తాండవం'... మాస్ డైలాగ్ తో ఇరగదీసిన బాలయ్య.. వీడియో వైరల్

బోయపాటి శ్రీను - బాలయ్య కాంబోలో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'అఖండ'. తాజాగా మేకర్స్ ఈ మూవీ సీక్వెల్ అనౌన్స్ చేశారు. ‘అఖండ 2 - తాండవం’ పేరుతో సీక్వెల్‌ తెరకెక్కనుంది. ఈ సందర్భంగా బాలయ్య కూతురు నారా బ్రహ్మీని క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు.

New Update

Balayya Akhanda2:   తెలుగు సినీ  పరిశ్రమలో బాలయ్య- బోయపాటి శ్రీను కాంబోకి ఉండే క్రేజే వేరబ్బా.  వీరిద్దరి కాంబోలో సినిమా అంటే మాస్ ఆడియన్స్ పండగనే చెప్పాలి. ఇప్పటికే విడుదలైన సింహ , లెజెండ్, అఖండ చిత్రాలు బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలుకొట్టాయి. 'అఖండ' అయితే బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇందులో బాలయ్య  ద్విపాత్రల్లో  తన నట విశ్వరూపాన్ని చూపించారు. మళ్ళీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ కాంబో మరో సారి ప్రేక్షకులను అలరించేందు సిద్ధమైంది. 

అఖండ 2

తాజాగా మేకర్స్ 'అఖండ'  సీక్వెల్ అనౌన్స్ చేశారు. ‘అఖండ 2 - తాండవం’ పేరుతో సీక్వెల్‌ తెరకెక్కనుంది. నిన్న పూజ కార్యక్రమాలతో  మూవీని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాలయ్య కూతుర్లు నారా బ్రహ్మీని, తేజశ్విని, డైరెక్టర్ బోయపాటి శ్రీను, నటి ప్రగ్య జైస్వాల్, నిర్మాతలు రామ్‌ అచంట, గోపీ అచంట పాల్గొన్నారు. బాల్యయ్య పెద్ద కూతురు బ్రహ్మీని క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. శివలింగం, రుద్రాక్షలు, హిమాలయాలు ఆధ్యాత్మికత అంశాలతో పోస్టర్ ఆకట్టుకుంటోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలిపారు. బాలయ్య తొలి పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని రామ్‌ అచంట, గోపీ అచంట నిర్మిస్తున్నారు. 

 

‘అఖండ 2 - తాండవం’

 

Also Read:  ఈ దీపావళికి సినిమాల ధమాకా.. ఏకంగా ఆరు చిత్రాల సందడి!

Advertisment
Advertisment
తాజా కథనాలు