allu arjun
Allu Arjun: సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో నిన్న OU JAC నాయకులు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు. దీంతో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేయగా.. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వారిని రెడ్డి శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్గా పోలీసులు గుర్తించారు. కాగా వీరిపై జూబ్లీహిల్స్ పోలీసులు BNS 331(5), 190, 191(2), 324(2), 292, 126(2), 131 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టు ముందు హాజరు పరిచారు. దీంతో ఈ కోర్టు రిమాండ్ విధించింది.
Also Read: అల్లు అర్జున్ నువ్వు చేసింది తప్పే.. కమెడియన్ రాహుల్ సంచలన ట్వీట్
నిందితులకు బెయిల్ ..
కాగా.. అల్లు అర్జున్ ఇంటిపై దాడికి చేసిన ముగ్గురు నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈరోజు ఉదయం వనస్థలిపురంలోని కమలానగర్ లో జస్టిస్ ముందు ప్రవేశ పెట్టగా.. ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున జరిమానా విధించింది.
ఇది కూడా చదవండి: అల్లు అర్జున్ కు బిగుసుకుంటున్న ఉచ్చు.. మరికొద్ది సేపట్లో ఏసీపీ కీలక ప్రెస్ మీట్!