2022 ఫిబ్రవరి చివరి వారంలో రిలీజైన మూవీ కశ్మీర్ ఫైల్స్. ఈ చిత్రం ఏకంగా రూ. 350 కోట్ల రూపాయలు కొల్లగొట్టి బాలీవుడ్లో రికార్డులు నెలకొల్పింది. దక్షిణాదిన పెద్దగా ఆడలేదు.. ఉత్తరాదిన మాత్రం దాదాపు నెల రోజుల పాటు చాలా చోట్ల నడిచింది. ప్రాపగాండ సినిమా అని, కశ్మీరీ పండిట్ల ఊచకోత గురించి ఒక వైపే చెప్పారని ఎన్ని కామెంట్లు వచ్చినా.. జనాలు మాత్రం ఎగబడి మరీ ఈ సినిమాను చూశారు. కరోనా టైమ్లో జరిగిన పరిస్ధితులు, ఇండియా తీసుకున్న చర్యలు, దేశంలో ఏర్పడ్డ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇది కూడా ప్రాపగాండ సినిమా అని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా పేరు గత 24గంటలుగా ట్విట్టర్లో తెగ ట్రెండ్ అవుతుంది. ఎందుకా అని చూస్తే.. ఈ సినిమా రిలీజ్ డేట్ అని తెలుస్తుంది. అందులో ఏముంది అనుకుంటున్నారా? అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది.
పూర్తిగా చదవండి..సలార్ మూవీని ‘ఢీ’ కొడుతానంటున్న కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు
కశ్మీరీ పండిట్లపై జరిగిన అఘాయిత్యాల నేపథ్యంలో తెరకెక్కిన మూవీ "ది కశ్మీర్ ఫైల్స్" బాక్సాఫీస్. ఇక ఈ సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి పేరు బాలీవుడ్లో మార్మోగిపోయింది. ప్రస్తుతం మూవీ ది వాక్సిన్ వార్ అనే మూవీ చేస్తున్నాడు. అయితే ఇదిలా ఉంటే.. తాజాగా సలార్ చిత్రానికి పోటీగా సెప్టెంబర్ 28న తన మూవీని రిలీజ్ చేయాలని కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మొండికేశాడట.ఎందుకంటే ప్రభాస్ మూవీతోనే తనకు లక్ కలిసొస్తుందని చెప్పుకొచ్చాడు.
Translate this News: