Pawan Kalyan: పిఠాపురానికి మెగా ఫ్యామిలీ.. పవన్‌ కు మద్దతుగా చిరంజీవి, రాంచరణ్‌, వరుణ్‌తేజ్‌ ప్రచారం..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పిఠాపురంలో మెగా ఫ్యామిలీ ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. మే 5న నియోజకవర్గంలో మెగాస్టార్‌ చిరంజీవి ప్రచారంలో పాల్గొననున్నట్లు సమాచారం. రాంచరణ్‌, వరుణ్‌తేజ్‌ కూడా త్వరలో ప్రచార రంగంలోకి దిగనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Pawan Kalyan: పిఠాపురానికి మెగా ఫ్యామిలీ.. పవన్‌ కు మద్దతుగా చిరంజీవి, రాంచరణ్‌, వరుణ్‌తేజ్‌ ప్రచారం..!
New Update

Mega Family Election Campaign At Pithapuram: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురానికి మెగా ఫ్యామిలీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi), గోబ్లల్ స్టార్ రాంచరణ్‌ (Ram Charan), ప్రిన్స్ వరుణ్‌తేజ్‌ ప్రచారం చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

అండగా మెగా ఫ్యామిలీ..

మే 5న పిఠాపురాం నియోజకవర్గంలో చిరంజీవి ప్రచారంలో పాల్గొననున్నట్లు సమాచారం. రేపు వరుణ్‌ తేజ్‌ ప్రచార రంగంలోకి దిగనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, రాంచరణ్‌ షెడ్యూల్‌ మాత్రం ఇంకా ఫిక్స్‌ కాలేదని తెలుస్తోంది. కాగా, ఇప్పటికే నాగబాబు ప్రచారంలో బిజీబిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే.

Also Read: రసవత్తరంగా పులివెందుల రాజకీయం.. సౌభాగ్యమ్మకు కౌంటరిస్తూ అవినాష్‌ తల్లి లక్ష్మి లేఖ


అయితే, ఇటీవల జనసేనకు చిరంజీవి రూ.5 కోట్ల విరాళం ఇచ్చారు. అంతేకాకుండా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే పవన్ కోసం జబర్ధస్త్ టీం ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కచ్చితంగా లక్షకు పైగా మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

రౌడీలు, గుండాలను..

మరోవైపు సీఎం జగన్‌పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. పిఠాపురంలో పవన్‌ను ఓడించడానికి మిథున్‌రెడ్డి, దాడిశెట్టి రాజా వల్ల కావడంలేదని..కడప నుంచి రౌడీలు, గుండాలను పంపిస్తున్నారని ఆరోపించారు. ఎంత మంది వస్తారో రండి.. చూస్కుందామని నాగబాబు సవాల్‌ విసిరారు.

#chiranjeevi #janasena-pawan-kalyan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి