KCR: కేసీఆర్‎కు చినజీయర్ స్వామి పరామర్శ

సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో తుంటి ఎముక గాయంతో హిప్ రీప్లేస్మెంట్ చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను చిన్నజీయర్ స్వామి శనివారం రాత్రి పరామర్శించారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతారని కేసీఆర్ ను ఆయన ఆశీర్వదించారు.

KCR: కేసీఆర్‎కు చినజీయర్ స్వామి పరామర్శ
New Update

KCR: సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో తుంటి ఎముక గాయంతో హిప్ రీప్లేస్మెంట్ చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను చిన్నజీయర్ స్వామి శనివారం రాత్రి పరామర్శించారు. చినజీయర్ స్వామి స్వయంగా హాస్పిటల్ కు వెళ్లి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతారని ఆశీర్వదించారు.

ఇది కూడా చదవండి: మై రాక్ స్టార్.. కేసీఆర్ నడుస్తున్న వీడియోపై ప్రకాశ్ రాజ్ ఎమోషనల్ ట్వీట్

కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో శుక్రవారం కేసీఆర్‌కు 20 మంది వైద్యులతో కూడిన బృందం సర్జరీ చేసింది. శస్త్రచికిత్స విజయవంతమైన విషయం తెలిసిందే. అనంతరం కేసీఆర్ ను పరామర్శించేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు, నాయకులు వస్తున్నారు. శనివారం సాయంత్రం యశోద హాస్పిటల్ కు వచ్చిన చినజీయర్ స్వామి వైద్యులతో పాటు, కేసీఆర్ కుటుంబ సభ్యులతో కొంతసేపు మాట్లాడారు. అంతా శుభం జరుగుతుందని ఆశీర్వదించారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్ ఆరోగ్యంపై అప్డేట్

కేసీఆర్ క్రమంగా కోలుకుంటున్నారని వైద్యులు ప్రకటించారు. చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తోందని, త్వరలోనే ఆయన పూర్తి ఆరోగ్యవంతుడవుతారని చెప్పారు. వైద్యుల పర్యవేక్షణలో, వాకర్ సాయంతో కేసీఆర్ హాస్పిటల్ లో మెల్లిమెల్లిగా నడుస్తున్న వీడియో సోషల్ మీడియా ద్వారా జనాల్లోకి విస్తృతంగా వెళ్లింది. ఆయన కోలుకుంటుండడంపై అభిమానులు, ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

#kcr #chinajeeyar-swami
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe