విపత్తులకు, విలయాలకు, వినాశాలకు చైనా కేరాఫ్గా మారిపోనుందా..? నాలుగేళ్లుగా నిత్యం ఏదో ఒక రూపంలో డ్రాగన్పై ప్రకృతి విరుచుకుపడుతూనే ఉంది. కరోనాకు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో ఇసుకు తుపానులు, భారీ వర్షాలు, వరదలు, వడగాలులు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్రతిఏడాది డ్రాగన్ని పలకరిస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది కూడా చైనాపై ప్రకృతి కన్నెర చేసిందట. చైనా వాతావరణ శాఖ చేసిన ప్రకటన చూస్తే ఈ విషయం క్లియర్కట్గా అర్థమవుతోంది. ఈ నెలలో(జులైలో) ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
పూర్తిగా చదవండి..Warning: జులై వస్తుందంటే చైనా ప్రజల్లో భయం భయం.. డ్రాగన్పై వరుసగా మూడోసారి ప్రకృతి పగపట్టిందా..?
చైనాలో చిత్రవిచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండాలు రికార్డు స్థాయిలో నమోదవుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే వర్షాలు కారణంగా 5లక్షల మంది ప్రభావితం అవ్వగా..ఈ జులైలో తుపాన్లు, టైఫున్లు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Translate this News: