భారతీయులతోపాటు యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం ఎట్టకేలకు రానే వచ్చింది. అసంపూర్తి కలను నెరవేర్చుకునేందుకు చంద్రయాన్-3 ఈరోజు ప్రయోగించనుంది ఇస్రో. ఇది చారిత్రాత్మక ఘట్టం అవుతుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి మధ్యాహ్నం 2:35 గంటలకు చంద్రయాన్-3 ప్రయోగం జరగనుంది. ఇప్పుడు ప్రపంచ దృష్టంతా కూడా ఈ మిషన్పైనే ఉంది. గురువారం మధ్యాహ్నం ఈ ప్రయోగాపికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ప్రయోగానికి ముందే చంద్రయాన్ 3 విజయవంతం కావాలని ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ప్రయోగానికి సంబంధించి సూక్ష్మ నమూనాను శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చారు శాస్త్రవేత్తలు.
పూర్తిగా చదవండి..నేడే చంద్రయాన్ -3 ప్రయోగం..ఆసక్తితో చూస్తోన్న యావత్తు ప్రపంచం..!!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్-3 ఈరోజు అంటే జూలై 14న ప్రయోగించబడుతుది. ప్రయోగానికి మరికొన్ని గంటలే సమయం ఉండటంతో.... ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రాకెట్ ను నింగిలోకి పంపించి చరిత్ర సృష్టించడంపై భారతదేశం దృష్టి సారించింది. ఈరోజు మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-3ని ఫ్లాగ్ ఆఫ్ చేయనున్నారు.
Translate this News: