Crime News: సెల్ఫీ తీసుకుంటూ గ్రామ వాలంటీర్ మృతి

కాకినాడ జిల్లా పిఠాపురంలో విషాదం చోటుచేసుకుంది. పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి బయటికి వెళ్లిన చంద్రంపాలెం గ్రామ వాలంటీర్ సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. సందీప్ చనిపోవడంతో కుటుంబసభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

New Update
Crime News: సెల్ఫీ తీసుకుంటూ గ్రామ వాలంటీర్ మృతి

Village Volunteer Died: కాకినాడ జిల్లా పిఠాపురంలో విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ తీసుకుంటూ మంచినీటి చెరువులో పడి గ్రామ వాలెంటర్ మృతి చెందాడు. సామర్లకోట మండలం చంద్రపాలెం గ్రామంలో పండగ పూట ఈ సంఘటన చోటుచేసుకుంది. చంద్రపాలెం గ్రామం నుండి పండుగ సందర్భంగా స్నేహితులతో  కోడిపందాలకు బయటకు వచ్చారు నాలుగురు యువకులు. అనంతరం పిఠాపురం మండలం చిత్రాడ గ్రామ శివారు మంచినీరు చెరువు వద్ద రిలాక్స్ అయేందుకు వెళ్లారు. అయితే, సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందాడు.

publive-image

Also Read: ప్రియుడి కోసం బరితెగించిన భార్య.. భర్తపై భారీ స్కెచ్.. బలైనా అమాయకురాలు..!

మృతుడు చంద్రంపాలెం సచివాలయంకు చెందిన గ్రామ వాలంటీర్ గుడాల సందీప్ (25) గా గుర్తించారు. అరుపులు వినపడటంతో రక్షించే ప్రయత్నం చేశారు తోటి స్నేహితులు. అయితే, అప్పటికే నీటిలో మునిగి వాలెంటర్ సందీప్ గల్లంతైయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రాత్రంతా సహాయక చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు మృతదేహాన్ని ఉదయం వెలికితీసి పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టంకి తరలించారు. సందీప్ మృతితో బాధిత కుటుంబసభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు