Tirupati: మత్తు పదార్థాల వాడకంలో రాష్ట్రంలో చంద్రగిరే ఫస్ట్.. ఇక్కడి నుండే టికెట్ కావాలి: సుధా యాదవ్

తిరుపతి జిల్లా చంద్రగిరిలో మత్తుపదార్థాలు వాడకంపై అవగాహన కల్పిస్తూ పాదయాత్ర నిర్వహించారు టీడీపీ నేత సుధా యాదవ్. ఈ నేపథ్యంలోనే చంద్రగిరి నియోజకవర్గం నుండి తాను టీడీపీ టికెట్ ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు.

New Update
Tirupati: మత్తు పదార్థాల వాడకంలో రాష్ట్రంలో చంద్రగిరే ఫస్ట్.. ఇక్కడి నుండే టికెట్ కావాలి: సుధా యాదవ్

Tirupati: తిరుపతి జిల్లాలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మత్తుపదార్థాలు వాడకం పై అవగాహన కల్పించారు టీడీపీ నేత సుధా యాదవ్. పార్టీలకు అతీతంగా గంజాయి వ్యతిరేక పాదయాత్ర కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించారు. చంద్రగిరిలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి నాగాలమ్మ ఆలయం వరకు పాదయాత్ర చేశారు. దేశంలో మత్తు పదార్థాల వాడకంలో రాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంటే, రాష్ట్రంలో చంద్రగిరి నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉందని సుధా యాదవ్ పేర్కొన్నారు.

Also Read: విశాఖలో దారుణం.. పెళ్లి చేసుకోమన్న ప్రియురాలిని ప్రియుడు ఏం చేశాడంటే ?

మత్తు పదార్థాల వాడకం వల్ల యువత నిర్వీరమవుతున్నారని..అందుకే అవగాహన కల్పిస్తూ ఈ పాదయాత్ర చేసినట్లు తెలిపారు. ఈ నేపధ్యంలోనే ఆయనకు సేవ కార్యక్రమాలు చేయడం అంటే చాలా ఇష్టం అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి రావడమే సరైన దారని వ్యాఖ్యనించారు. రానున్న ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుండి టీడీపీ తరఫున టికెట్ ఆశిస్తున్నట్లు సుధాయాదవ్ స్పష్టం చేశారు. టీడీపీకి వెన్నుముక అయినటివంటి బీసీలను పార్టీ అధినేత చంద్రబాబు ఆదుకుంటారని కామెంట్స్ చేశారు.

Also Read: టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు..ఇన్ని ఇవాల్సిందే అంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు