/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Chandrababu-2-2-jpg.webp)
TDP Chief Chandrababu: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు ఒక్కరోజే ఐదు ప్రజాగళం సభల్లో పాల్గొననున్నారు. ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. నేటితో 82 నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలు పూర్తి చేసిన ఆయన.. రేపు ఐదు సభలు, శనివారం మూడు సభల్లో పాల్గొననున్నారు. పలమనేరులో మార్చి 27న ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన ఆయన.. ప్రచార గడువు ముగిసేనాటికి 90 నియోజవర్గాల్లో ప్రజాగళం సభలు పూర్తిచేయనున్నారు.