ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రతిపక్ష టీడీపీ దూకుడు పెంచింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని విజయంతో మంచి జోరు మీదున్న సైకిల్ పార్టీ ప్రజల్లోనే ఉండేందుకు ప్రణాళికలు రచించింది. ఓ వైపు యువనేత నారా లోకేశ్ పాదయాత్రతో జనాల్లోనే ఉంటూ వారి సమస్యలు వింటున్నారు. మరోవైపు అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రెస్మీట్లు పెడుతన్నారు. తాజాగా ఏపీలో ప్రాజెక్టుల సందర్శనకు ఆయన శ్రీకారం చుట్టారు. ఆగస్టు 1 నుంచి పది రోజుల పాటు తెలుగు నేలకు జలహారం పేరిట పెన్నా నుంచి వంశధార వరకు ప్రాజెక్టుల సందర్శన చేయనున్నారు. క్షేత్రస్థాయిలో వాటి స్థితిగతులను ప్రజలకు వివరించేందుకు సిద్ధమయ్యారు.
పూర్తిగా చదవండి..‘పెన్నా టు వంశధార’.. ప్రాజెక్టులపై పోరుబాటకు చంద్రబాబు సిద్ధం
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందంటూ పోరుబాటకు సిద్ధమయ్యారు. ఆగస్టు 1 నుంచి పది రోజుల పాటు తెలుగు నేలకు జలహారం పేరిట పెన్నా నుంచి వంశధార వరకు ప్రాజెక్టుల సందర్శన చేయనున్నారు.
Translate this News: