ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని ఎత్తిచూపేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు(chandra babu naidu) ఇవాళ(ఆగస్టు 2) సీఎం జగన్(cm jagan) సొంతగడ్డలో పర్యటించనుండడం కాక రేపుతోంది. జగన్ సొంతగడ్డ అయిన పులివెందులలో టీడీపీ అధినేత రోడ్షో నిర్వహించనుండడంతో రాయలసీమలో మళ్లీ రాజకీయ వేడి రాజుకున్నట్టే కనిపిస్తోంది. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా చంద్రబాబు నిన్న(ఆగస్టు 1) నంద్యాల జిల్లాలో పర్యటించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రాజెక్టును పరిశీలించారు. ఇక ఇవాళ(ఆగస్టు 2) పులివెందుల పట్టణంలో రోడ్షో నిర్వహించనున్నారు. అయితే చంద్రబాబు పులివెందుల పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని సమాచారం!
పూర్తిగా చదవండి..చంద్రబాబు పులివెందుల రోడ్షోపై ఉత్కంఠ.. రాయలసీమలో వేడెక్కిన రాజకీయం
ఇవాళ(ఆగస్టు 2) చంద్రబాబు పులివెందుల పర్యటనపై సస్పెన్స్ నెలకొంది. 2019లో టీడీపీ ఓటమి తర్వాత తొలిసారిగా సీఎం జగన్ సొంతగడ్డపై చంద్రబాబు కాలు మోపనున్నారు. రోడ్షో, బహిరంగ సభలకు ప్లాన్ చేశారు. అయితే ఈ కార్యక్రమానికి పోలీసుల అనుమతిపై గందరగోళం నెలకొని ఉంది. రోడ్ షో సందర్భంగా పులివెందులలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉండడంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.
Translate this News: