/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Chandrababu-Pawan-Kalyan-.jpg)
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఈ నెల 31న భేటీ కానున్నారు. ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత వారు తొలిసారి సమావేశం కానున్నారు. అదే రోజు బీజేపీ నేతలతోను చంద్రబాబు భేటీ అవనున్నారు. పోలింగ్ జరిగిన తీరు, తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై వీరు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు ఉండవల్లికి చంద్రబాబు వెళ్లనున్నారు. ఈ రోజే విదేశీ పర్యటన నుంచి చంద్రబాబు హైదరాబాద్ వచ్చారు. మరో వైపు జూన్ 3న పవన్ కల్యాణ్ పార్టీ నేతలు, కార్యకర్తలతో కీలక భేటీ నిర్వహించనున్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీస్లో ఈ మేరకు ఏర్పాట్లు సాగుతున్నాయి. కౌంటింగ్ రోజు విజయవాడలోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉండనున్నారు.