2019 నుంచి దేశంలో ఈ-సిగరెట్లపై 9e-cigarette) నిషేధం విధించారు. ఇప్పటికీ కొన్ని ఆన్లైన్ షాపింగ్ సైట్లు, రిటైల్ అవుట్లెట్లలో విచక్షణారహితంగా విక్రయిస్తున్నారు. ఇప్పుడు తమ పోర్టల్లో ఈ-సిగరెట్ (e-cigarette) నిషేధాన్ని ఉల్లంఘించినట్లు సమాచారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రాలను కోరింది. ఈ క్రమంలోనే పోర్టల్ (www.violation-reporting.in) సమాచారాన్ని సేకరించేందుకు, ఉల్లంఘనలపై సత్వర చర్య తీసుకోవడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సహాయపడుతుందని తెలిపింది. ఈ -సిగరెట్ల అమ్మకాలు, వాటికి సంబంధించి ప్రకటనలు చేస్తోన్న పలు వెబ్ సైట్ల కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశాజారీ చేసింది.
పూర్తిగా చదవండి..e-cigarette: తాట తీస్తాం.. ఈ-సిగరెట్ల అమ్మితే ఊరుకోబోం.. కేంద్రం నోటీసులు..!!
ఈ -సిగరెట్ల (e-cigarette)అమ్మకాలపై కొరడా ఝులిపించింది కేంద్రం. ఇకపై అమ్మినా...కొనుగోలు చేసినా తాటతీస్తామంటూ హెచ్చరించింది. నిషేధం విధించినా కూడా విక్రయిస్తున్న 15వెబ్ సైట్లకు (15 websites)నోటీసులు పంపింది. ఈ సిగరెట్ నిషేధాన్ని ఉల్లంఘిస్తే...కఠిన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది సర్కార్.
Translate this News: