/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-46-jpg.webp)
Padmasri Awards 2024: ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారాలను 2024 సంవత్సరానికి కేంద్రప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 34 మందిని పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు కళాకారులు కూడా ఉన్నారు. తెలంగాణలోని జనగామ జిల్లాకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి దాసరి కొండప్పను కూడా పద్మశ్రీ వరించింది. కొండప్ప బుర్ర వీణ వాయిద్యకారుడు. వారితో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన హరికథా కళాకారిణి ఉమామహేశ్వరికి కూడా పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆమెది కృష్ణా జిల్లా మచిలీ పట్నం.