Ex MLA Jeevan Reddy: మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై కేసు నమోదు

చేవెళ్లలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. భూమిని కబ్జా చేసాడంటూ బాధితుడు ఫిర్యాదు చేయడంతో జీవన్‌ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.

Ex MLA Jeevan Reddy: మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై కేసు నమోదు
New Update

Ex MLA Jeevan Reddy:

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై కేసు నమోదు అయింది. జీవన్ రెడ్డి తో పాటు అతని కుటుంబ సభ్యుల పై చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఎర్లపల్లి లో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో దామోదర్ రెడ్డి అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. సర్వే నెంబర్ 32, 35, 36, 38 లో ఫంక్షన్ హాల్ నిర్మించుకున్నాడు దామోదర్ రెడ్డి. దామోదర్ రెడ్డి భూమికి పక్కనే జీవన్ రెడ్డి భూమి ఉంది.

2023లో ఫంక్షన్ హాల్ లో కూల్చేసి దామోదర్ రెడ్డి భూమిని జీవన్ రెడ్డి కబ్జా చేశాడు. కబ్జా చేసిన భూమికి రక్షణగా పంజాబీ గ్యాంగ్ ను జీవన్ రెడ్డి పెట్టాడు. తన ఫంక్షన్ హాల్ కూల్చేయడంతో నిలతీసేందుకు వెళ్లిన దామోదర్ రెడ్డి పై దాడికి దిగారు పంజాబీ గ్యాంగ్. మరణాయుధాలు చూపించి దామోదర్ రెడ్డిని భయభ్రాంతులకు జీవన్ రెడ్డి అనుచరులు, పంజాబీ గ్యాంగ్ గురి చేశారు. ఘటనపై తాజాగా చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు దామోదర్ రెడ్డి. జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులపై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 447, 427, 341, 386, 420, 506 r/w 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

#ex-mla-jeevan-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe