ఎమోజీలతో మాట్లాడుకునే కాలమిది. కష్టపడి పేరాలకు పేరాలు రాసే బదులు.. ఒక్క ఎమోజీతో సంభాషన ముగించేసే వాళ్లుంటారు. ఒక్కొక్క ఎమోజీకి ఒక్కొక అర్థం ఉంటుంది. కొన్ని ఎమోజీలకు రెండు,మూడు అర్థాలు కూడా ఉంటాయి. అవి సందర్భాన్ని బట్టి మారుతుంటాయి. వాట్సాప్ లేదా ఇతర సోషల్మీడియా యాప్స్లో ఎమోజీలదే హవా. ఎమోజీలు లేని కన్వర్జేషన్ ఉండదు. చదవడం రాని వాళ్లు కూడా ఎమోజీలతో అవతలి వాళ్లు చెప్పే విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఎమోజీలకు అంత పవర్ ఉంది. అందుకే దాన్ని ఎడాపెడా వాడకూడదు. అలా వాడిన ఓ రైతు రూ.50లక్షలు చెల్లించుకోవాల్సి వచ్చింది. ఛాట్ మధ్యలో యూజ్ చేసిన ‘థంబ్స్ అప్’ ఎమోజీ అతని కొంపముంచింది. కోర్టు చివాట్లతో డబ్బులు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఇదేంటి ఎమోజీ వాడితే కోర్టు తిట్టడమేంటి..డబ్బులు కట్టడమేంటని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ రియల్ స్టోరీ చదవాల్సిందే..!
పూర్తిగా చదవండి..Emoji: ‘థంబ్స్ అప్’ ఎమోజీ పంపాడు.. రూ.50లక్షలు ఫైన్ కట్టాడు..ఎందుకో తెలుసా?
కెనడాలో ఓ కోర్టు ఇచ్చిన తీర్పు ఆ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. రైతుకు, కొనుగోలుదారుడికి మధ్య తలెత్తిన వివాదంలో "థంబ్స్ అప్" ఎమోజీని సంతకంగా గుర్తిస్తూ కెనడా న్యాయమూర్తి తీర్పునిచ్చారు. రూ.50లక్షల జరిమానాను కొనుగోలుదారుడికి కట్టమని తీర్పు చెప్పారు.
Translate this News: