జార్ఖండ్లోని గిరిడిహ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన రాత్రి 8.40 గంటల ప్రాంతంలో జరిగింది. బస్సు నదిలో పడిపోయిందన్న సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం ఘటనాస్థలికి చేరుకుంది. సహాయక చర్యల అనంతరం క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పూర్తిగా చదవండి..జార్ఖండ్లో నదిలో పడిన బస్సు, ఆరుగురు మృతి, 20మందికి తీవ్ర గాయాలు..!!
జార్ఖండ్లోని గిరిదిహ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. డుమ్రీ గ్రామంలో బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో మొత్తం 40మంది ప్రయాణికులు ఉన్నారు.
Translate this News: