జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బుద్దా వెంకన్న.! సోషల్ మీడియాలో బుద్ధా పై ఫైర్ అవుతున్న ఎన్టీఆర్ అభిమానులు!

తెలుగు చలనచిత్ర హీరోల్లో పేరుగాంచిన వారిలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్..అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్నఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశంకు ఎన్టీఆర్ కు సంబంధమేమిటని మీడియాలో విరుచుకుపడ్డారు.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై జూనియర్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ పై  సంచలన వ్యాఖ్యలు  చేసిన బుద్దా వెంకన్న.! సోషల్ మీడియాలో బుద్ధా పై ఫైర్ అవుతున్న ఎన్టీఆర్ అభిమానులు!
New Update

టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ 2014 , 2019 , 2024 ఎన్నికల్లో టీడీపీ కోసం ప్రచారం చేయలేదని జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. YCP ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నాని అనవసరంగా ఈ అంశాన్ని లెవనెత్తాల్సిన అవసరం లేదన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టీడీపీ అధ్యక్ష బాధ్యతలు నారా లోకేష్ కు అప్పగించాలన్నారు.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా  చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజే నారా లోకేశ్ ను పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని బుద్దా వెంకన్న కోరారు. లోకేశ్‌ని టీడీపీ అధ్యక్షుడిగా నియమిస్తే మరో 30 ఏళ్లు పార్టీ బతుకుతుందన్నారు. బుద్ధా వెంకన్న. అచ్చెన్నాయుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాగా పనిచేశారని బుద్దా వెంకన్న అన్నారు. ఆయనకు మంత్రి వర్గంలో కీలక శాఖ కేటాయించాలని చంద్రబాబుని కోరుతున్నట్లు చెప్పారు.

అయితే బుద్ధా వెంకన్నా ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఓ ఛానల్ ఇంటర్వూలో పాల్గొని జూనియర్ ప్రస్థావన మరొసారి తీసుకువచ్చారు. తారక్ చంద్రబాబు సతీమణినీ అసెంబ్లీ లో దూషించినప్పుడు,చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు స్పందించని వ్యక్తి పార్టీ కి ఏం సంబంధమని విరుచుకుపడ్డారు.ఈ వ్యాఖ్యలను సీరీయస్ గా తీసుకున్న తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బుద్ధా వెంకన్న పై ఫైర్  అవుతున్నారు.కొందరు ఈ ప్రస్తావన ఎన్నికల ముందు తీసుకువచ్చి ఉంటే TDP కు ఓట్ల ఎఫెక్ట్ పడేదని  కామెంట్ చేస్తున్నారు.

#ap-assembly-elections-2024 #ap-news #ap-politics
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe